'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' టీజర్.. ఇంటరెస్టింగ్ గా ఉందే!

By Udaya DFirst Published Mar 4, 2019, 10:54 AM IST
Highlights

ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు అడివి సాయికిరణ్ రూపొందిస్తోన్న తాజా చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. 

ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు అడివి సాయికిరణ్ రూపొందిస్తోన్న తాజా చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. ఈ సినిమాలో తీవ్రవాది 'ఘాజీబాబా' పాత్రలో ప్రముఖ రచయిత అబ్బూరి రవి నటించారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ని హీరో మహేష్ బాబు విడుదల చేశారు. నలుగురు స్నేహితులు, ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, ఘాజీబాబా అనే తీవ్రవాది ఇలా ఇండియా-పాకిస్తాన్ మధ్య నడిచే కథగా టీజర్ ని చూస్తే అర్ధమవుతోంది. టీజర్ ని ఆసక్తికరంగా కట్ చేశారు.

ఈ సినిమాలో 'ఎయిర్ టెల్' మోడ‌ల్ శ‌షా చెత్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, మ‌నోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులుగా నటించారు. ఈ ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

click me!