
కొత్త సినిమాలను ఎంకరేజ్ చేయడంలో ముందుంటున్నారు స్టార్ డైరెక్టర్ వినాయక్. యంగ్ టాలెంట్ తో చిన్న సినిమాలు చేస్తున్న వారిని దగ్గరుండి నడిపిస్తున్నారు.
కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఉదయ్ శంకర్ హీరోగా, జన్నీఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్ శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ లో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఫస్ట్ క్లాప్ ఇచ్చి టీం కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి ఆత్మీయ అతిథిగా విచ్చేసి యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ మూవీ లో మధునందన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ కీలక పాత్రల పోషిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే కథా, కథనాలతో సాగే ఈ మూవీ ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించబోతున్నట్టు తెలుస్తోంది. ఇది మా కథ వంటి ఒక యునిక్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ఆకట్టుకున్న దర్శకుడు గురు పవన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
ఇక ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25 నుండి వైజాగ్ లో ప్రారంభం అవుతుంది. మొదటి షెడ్యూల్ వైజాగ్ లో 20 డేస్ చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ పుప్పాలగూడ లోని శివాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమా కాన్సెప్ట్ ని తెలుసుకొని టీం ని అభినందిచారు స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్. ఒక అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్ వేలో సినిమాను చేయబోతున్నట్టు డైరెక్టర్ గురు పవన్ తెలిపారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి నారాయణరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.