
నటి నయనతార విషయానికే వస్తే కోలీవుడ్లో రూ.10 లక్షల పారితోషికంతో ప్రారంభమైన తన కెరీర్ ఇప్పుడు కోట్లకు చేరింది. మొన్నటి వరకూ మూడు కోట్లు పుచ్చుకున్న ఈ మాలీవుడ్ సంచలన తార ఇటీవల నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఏంటి అప్పుడే ఆశ్చర్య పోతున్నారా? ఈ మొత్తం హీరోల సరసన నటించడానికేనట.
నయనతార ఈ మధ్య హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనే అధికంగా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. మాయ చిత్రం నుంచి ఈ తరహా చిత్రాల అవకాశాలు ఆమె తలుపు తట్టడం ఎక్కువైంది. ప్రస్తుతం నయనతార నటిస్తున్న డోరా, ఇమైక్కా నోడిగళ్, అరం, కొలైయుధీర్ కాలం తదితర చిత్రాలన్నీ కథానాయకి చుట్టూ తిరిగే కథా చిత్రాలే.
ఇలాంటి చిత్రాలకు ఆ జాన పారితోషికం డిమాండ్ చేస్తున్నదెంతో తెలుసా? అక్షరాలా ఏడు కోట్లట. ఇది ఏ దక్షిణాది తార పొందనటు వంటి మొత్తం అని వేరే చెప్పాలా’ అయితే ఇది టూమచ్ అంటున్నారు సినీ వర్గాలు. నయనతార చిత్రాలు లాభాలు గడిస్తున్నాయి అందుకే అంత పారితోషికం డిమాండ్ చేస్తున్నారనే వారూ లేక పోలేదు.