తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

`గ్యాంగ్‌లీడర్‌` బాకీ తీర్చుకునేందుకు కలుస్తున్న నాని, ప్రియాంక.. ముహూర్తం ఫిక్స్..

Aithagoni Raju | Published : Oct 22, 2023 11:30 AM

నాని, వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో `అంటే సుందరానికి` చిత్రం వచ్చింది. అలాగే నాని, ప్రియంక మోషన్‌ జంటగా `గ్యాంగ్‌ లీడర్‌` వచ్చింది. ఈ రెండు డిజప్పాయింట్‌ చేశాయి. తాజాగా వీరంతా ఆ బాకీ తీర్చుకునే పనిలో పడ్డారు.

నేచురల్‌ స్టార్‌ నాని.. `దసరా` చిత్రం తర్వాత ఇమేజ్‌ పరంగా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాడు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అనంతరం ఆయన చేసే సినిమాలు అదే రేంజ్‌లో ఉంటున్నాయి. భారీ స్కేల్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం నాని `హాయ్‌ నాన్న` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌లో రాబోతుంది. ఆ తర్వాత వివేక్‌ ఆత్రేయతో ఓ సినిమా చేయబోతున్నారు. `నాని31` గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. 

ఈ సినిమాకి సంబంధించిన కాస్టింగ్‌ వివరాలను ప్రకటిస్తుంది. డీవీవీ దానయ్య నిర్మించే ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తుంది. ఈ ఇద్దరు గతంలో `గ్యాంగ్‌ లీడర్‌` చిత్రంలో నటించారు. సినిమా పోయినా, ఈ జంటకి మంచి పేరొచ్చింది. కూల్‌ పెయిర్‌గా పిలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ జంట వెండితెరపై మెరవబోతుంది. వివేక్‌ ఆత్రేయ చిత్రంలో జోడీ కడుతున్నారు. 

వీరిద్దరితోపాటు కీలక పాత్రలో దర్శకుడు, నటుడు ఎస్‌ జే సూర్య నటిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు. సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. రేపు పూర్తి డిటెయిల్స్ ఇచ్చి, మంగళవారం సినిమాని ప్రారంభించబోతున్నారు. ఎల్లుండి ముహూర్తం ఫిక్స్ చేశారు. థ్రిల్‌ అయ్యే ఎలిమెంట్లు, చిల్‌ అయ్యేలా, ఫన్‌తో ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. 

వివేక్‌ ఆత్రేయతో నాని.. `అంటే సుందరానికి` చిత్రంలో నటించారు. ఈమూవీ సక్సెస్‌ కాలేదు. దీంతో మరోసారి కలిసి వర్క్ చేస్తున్నారు. ఫెయిల్యూర్‌ బాకీ తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి ముహూర్తం స్టార్ట్ చేసి, త్వరలోనే షూటింగ్‌ జరుపబోతున్నారట. `హాయ్‌ నాన్న` చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు వివేక్‌ మూవీపై ఫోకస్‌ పెడుతున్నారు నాని. 

ఇక శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న `హాయ్‌ నాన్న` చిత్రం కూతురు సెంటిమెంట్‌, లవ్‌ ఎమోషనల్‌ జర్నీగా ఉండబోతుందట. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించగా, శృతి హాసన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 7న విడుదల కాబోతుంది. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!