మహేష్‌బాబు-రాజమౌళి సినిమాలో నాగార్జున.. ఏం చేయబోతున్నారంటే?

By Aithagoni RajuFirst Published Jan 30, 2024, 6:54 PM IST
Highlights

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో భారీ మూవీ రూపొందబోతుంది. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. అయితే ఇందులో నాగార్జున భాగం కాబోతున్నారట. మరి ఏం చేయబోతున్నారు..

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. భారీ పాన్‌ ఇండియా సినిమాగా కాదు, ఇంటర్నేషనల్‌ మూవీ రేంజ్‌లో దీన్ని తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇందులో అంతర్జాతీయ టెక్నీషియన్లు కూడా పనిచేయబోతున్నారట. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీ ఇది. ఇందులో మహేష్‌ బాబు సాహసికుడి పాత్రలో కనిపించబోతున్నారు. 

ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందట. త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. వీలైతే మరో రెండు మూడు నెలల్లో, మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రాజమౌళి ఈ మూవీని చాలా పెద్ద స్కేల్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌ అంటున్నారు. కానీ ఐదు వందల కోట్లకుపైగానే ఉంటుందని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా ఈ మూవీని రిలీజ్‌ చేసే ప్లాన్లో ఉన్నారు రాజమౌళి. అంతేకాదు దీన్ని రెండు మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేష్‌ బాబు పారితోషికం తీసుకోవడం లేదట. ఆయన రెమ్యూనరేషన్‌ తీసుకోకుండానే నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నిర్మాణంలో ఆయన భాగమవుతున్నట్టు సమాచారం. తన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ భాగస్వామిగా మారుతుందని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో కింగ్‌ నాగార్జున కూడా భాగం కాబోతున్నారట. అంతే ఆయన నటించడం లేదు. కానీ నిర్మాణంలో భాగమవుతున్నారట. తన అన్నపూర్ణ స్టూడియో ప్రొడక్షన్‌లో బ్యాక్‌ సపోర్ట్ గా ఉంటుందని తెలుస్తుంది. షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్‌, వీఎఫ్‌ఎక్స్ ఇలా పలు విభాగాల్లో ఈ మూవీ భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

click me!