స్టార్ డైరక్టర్ కోటి మోసం, కోర్టుకెక్కిన నటుడు!

By Udayavani DhuliFirst Published Dec 27, 2018, 9:27 AM IST
Highlights

నన్ను ఆ స్టార్ డైరక్టర్ మోసం చేసాడంటూ గోలెత్తిపోతున్నాడు..మీడియాకు ఎక్కుతున్నాడు ఓ అప్ కమింగ్ నటుడు. అయితే అతని గోడు ఎవరూ వినిపించుకోవటం లేదు.

నన్ను ఆ స్టార్ డైరక్టర్ మోసం చేసాడంటూ గోలెత్తిపోతున్నాడు..మీడియాకు ఎక్కుతున్నాడు ఓ అప్ కమింగ్ నటుడు. అయితే అతని గోడు ఎవరూ వినిపించుకోవటం లేదు. దాంతో గతంలో ఓ సారి మీడియాలో ఆ స్టార్ దర్శకుడు మిస్కిన్ గురించి మాట్లాడిన ఆయన మరోసారి తన కోటి రూపాయలు తనకు ఇప్పించమని కోరుతున్నాడు. 

వివరాల్లోకి వెళితే... తమిళంలో విభిన్న చిత్రాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరక్టర్ మిస్కిన్. ఆయన తెలుగులోనూ‘తుప్పరివాలన్‌’ (తెలుగులో ‘డిటెక్టివ్’)వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకొన్నాడు . ప్రస్తుతం ఈ దర్శకుడు ఉదయనిధి హీరోగా ‘సైకో’ అనే కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైపోయింది. ఇందులో అతిథిరావు, నిత్యామేనన్‌లు కథానాయికలు. పోలీసు అధికారి పాత్రలో దర్శకుడు రామ్‌ నటిస్తుండటం విశేషం. ఐతే, ‘సైకో’ కథని మిస్కిన్ 2015లోనే రెడీ చేసుకొన్నాడట.

అప్పట్లో ఈ కథని నటుడు మైత్రేయ వినిపించాడట. మైత్రీయ తండ్రి నుంచి అడ్వాన్స్ రూపంలో కొంత అడ్వాన్సుగా తీసుకొన్నాడట. అయితే ‘సవరకత్తి’, ‘తుప్పరివాలన్‌’ సినిమాల కోసం కొంత సమయం కావాలని అడిగారట. ఈ రెండూ పూర్తయ్యాక ‘సైకో’ను ప్రారంభించనున్నట్లు తెలిపినట్టు మైత్రీయ ఆరోపిస్తున్నారు. ఇప్పుడేమో.. ‘సైకో’ని ఇతర నటులతో తీస్తున్నారు.

దాంతో తన కొడుకు మైత్రేయతో తీయాల్సిన సినిమా స్క్రిప్టుతోనే ఉదయనిధితో సినిమా ప్రారంభించాడని రఘునందన్ ఆరోపిస్తున్నాడు. మిస్కిన్ తమను మోసం చేశాడనే ఆరోపణలతో రఘునందన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వీరి ఎగ్రిమెంట్ ని  మీరి అదే కథతో  మరో సినిమా షూట్ చేయకూడదని.. రిలీజ్ చేయకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ‘మిస్కిన్’ సైకో షూటింగ్ను నిలిపివేయాల్సి వచ్చింది. దీని గురించి మిస్కిన్ ని ప్రశ్నిస్తే.. ‘మీతో సినిమా చేయడం వీలుకాదు. అడ్వాన్స్‌ కూడా ఇవ్వలేను’ అని చెబుతున్నారు.

 

click me!