ముంబయ్ టు తిరుపతి, ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేయబోతున్నారంటే..?

By Mahesh JujjuriFirst Published Jun 4, 2023, 10:20 AM IST
Highlights

ఆదిపురుష్ కోసం ప్రభాస్ ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అభిమానుల కోసం ఈనెలలో రిలీజ్ కాబోతోంది సినిమా. ఇక ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం.. ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్ డిఫరెంట్ గా ఆలోచించి ఓ పని చేయబోతున్నారు. అదేంటంటే..? 


గ్లోబల్ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్ జంటగా నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్.  రాముడిగా ఆరుడుగుల అందగాడు ప్రభాస్ నటిస్తుండగా..సీతగా కృతీసనన్ నటిస్తుంది. రావణాసురిడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇక ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈసినిమాను భారీ బడ్డెజ్ తో.. భారీ స్థాయిలో నిర్మించారు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఇండియన్ సినిమా ఆదిపురుష్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు ఇక ఈ ఈవెంట్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. భారీస్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అంతే కాదు వెరైటీగా ఏం చేయాలా అన్న ఆలోచనలో ఉన్నారు టీమ్. అయితే ఇప్పటికే ఈ విషయంలో ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్ ఓ అడుగు ముందుకు వేశారు. ఈసినిమాకు అజయ్ అండ్ అతుల్ ఇద్దరు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. 

ఈక్రమంలో ఈ ఇద్దరిలో ఒకరైన అతుల్ ఈసినిమా గ్రాండ్ ఈవెంట్ కి ఏకంగా ముంబై నుంచి తిరుపతికి బైక్ పై జర్నీ చేస్తూ రావాలని నిర్ణయించుకున్నారట. దీనితో తనకు తీసుకున్న ఊహించని స్టెప్ అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ ఈవెంట్ కి అయితే తాను చేరుకున్న తర్వాత తన సోదరుడు అజయ్ తో కలిసి ఈ సినిమా సెన్సేషనల్ చార్ట్ బస్టర్ సాంగ్ జై శ్రీరామ్ ని కలిసి ఆలపించనున్నాడట. 

మరి ముంబై లో అయితే అతుల్ ఈ జూన్ 3న స్టార్ట్ అయ్యి జూన్ 6న ఈవెంట్ డే కి తిరుపతి చేరుకొని వెంకన్న స్వామి ఆశీస్సులతో అయితే ఈ మహా ఈవెంట్ లో పాల్గొననున్నారట. అంటే ఇప్పటికే అతను స్టార్ట్అయ్యాడు. ఈ ఈవెంట్ కు ఇది ప్రత్యేక ఆకర్షణ అవ్వబోతోంది. ఇక ఈమూవీ రిలీజ్ అయ్యి  ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు సినీజనాలు. 

click me!