రీసెంట్ గా సినిమా ప్రోడక్షన్ లోకి ఎట్రీ ఇచ్చాడు స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ. తన భార్యతో కలిసి సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ధోనీ.. తాజాగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
క్రికెటర్ గా స్టార్ డమ్ సంపాధించడంతో పాటు.. కపిల్ దేవ్ తరువాత ఇండియాకు వరల్డ్ కప్ సాధించిన కెప్టెన్ గా నిలిచిపోయాడు ఎంఎస్ ధోనీ. స్టార్ క్రికెటర్ గా ఊపు ఊపిన ధోనీ.. తాజాగా నిర్మాతగా మారి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. హోం బ్యానర్ డెబ్యూ ప్రాజెక్ట్ ఎల్జీఎం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా.. మంచి టాక్ తెచ్చుకుంది. అయితే నటుడిగా కూడా సిల్వర్ స్క్రీన్పై ధోని మెరిసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
సౌత్ సినిమాలపై మక్కువ ఎక్కువగా చూపిస్తున్నాడు ధోని. అందులోనే తమిళ సినిమాలను ఎక్కువగా ఓన్ చేసుకుంటున్నాడు. ఆయన ఎంట్రీ కూడా తమిళం నుంచే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి 67 వ సినిమాలో కీలక పాత్రలో స్టార్ క్రికెటర్ కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. కాని అందులో నిజం లేదని.. మరో వర్గం వాదన. అయితే థోనీ ఎంట్రీ పక్కా అంటున్నాయి తమిళసినీ వర్గాలు.
ధోనీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పక్కాగా జరుగుతుంది అది కూడా తమిళ సినిమా.. విజయ్ తోనే ఉంటుంది అని అంటున్నారు కోలీవుడ్ జనాలు. కాని ప్రచారం జరిగినట్టుగా.. లియోలో ఆయన కనిపించడం లేదని ఆ తర్వాత క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మరోసారి ధోనీకి సంబంధించిన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సారి విజయ్ 68 లో థోనీ నటిస్తున్నాడటున్నారు సినీ వార్గాలు. ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్న విజయ్ మరోవైపు దళపతి 68 సినిమా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్లో చేయనున్నాడు.
ఎంఎస్ ధోనీ ఈ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్పై మెరువబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. మరి ధోనీ ఎంట్రీ ఈ సారి పక్కానేనా..? ఈ న్యూస్ కూడా గాసిప్గానే మిగిలిపోతుందా..? లేదా..? అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. దళపతి 68 షూటింగ్ అక్టోబర్లో షురూ కానుందని తాజా టాక్. వెంకట్ ప్రభు టీం 2024 దీపావళి కానుకగా ఈ సినిమా రాబోతుందని సమాచారం. పక్కా పొలిటికల్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈమూవీ ద్వారా విజయ్ పొలిటికల్ కెరీర్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అంతే కాదు తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈసినిమాతో 20 ఏళ్ల తరువాత విజయ్, జ్యోతికి కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే మెయిన్ హీరోయిన్ గా కాకుండా.. లీడ్ రోల్ లో జ్యోతిక కనిపించబోతుందట. అయితే ఈ విషయాలలో మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీలో స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య విజయ్ కు విలన్గా కనిపించబోతున్నట్టు టాక్. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.