ఆ రూమర్ విని మెగాస్టార్ మండిపడుతున్నారట

By AN TeluguFirst Published Jul 4, 2019, 5:04 PM IST
Highlights

స్టార్స్ పై రూమర్స్ రావటం అతి సహజం. వాళ్లు అతిగా రెస్పాండ్ కాకుండా చాలా సార్లు లైట్ తీసుకుంటారు. 

స్టార్స్ పై రూమర్స్ రావటం అతి సహజం. వాళ్లు అతిగా రెస్పాండ్ కాకుండా చాలా సార్లు లైట్ తీసుకుంటారు. అయితే ఒక్కోసారి శృతి మించినప్పుడు మాత్రం వాళ్లకు మండుకొస్తుంది. అలాంటి రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ల అంతు చూడాలనిపిస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తనపై వచ్చిన ఓ రూమర్ చూసి మండిపడుతున్నారట.

ఇంతకీ ఆ రూమర్ ఏమిటి అంటే...మెగాస్టార్ తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 151 సైరా సినిమా అక్టోబర్ 2న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఫైనల్ కట్ రెడీ అవుతోన్న వేళ చిరంజీవితో పాటు మిగిలిన మెగా టీం అంతా ఎడిటింగ్ రూంలో కెలుకుడు స్టార్ట్ చేసినట్టు  మీడియాలో కొందరు వార్తలు మొదలెట్టారు. మెగా టీమ్ అంతా కలిసి అలా చేయాలి.. ఇలా చేయాలంటూ అతి చేస్తుండడం దర్శకుడు సురేందర్‌రెడ్డికి తీవ్రమైన అసహనం కలిగిస్తోన్నట్టు రాసుకొచ్చారు‌. అంతేకాకుండా కొన్ని సీన్లు షూట్ చేసేటప్పుడు స్వయంగా మెగాస్టార్ అలా చేస్తే బాగుంటుంది… ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడంతో చివరకు అవి కూడా దర్శకుడు సురేందర్‌రెడ్డి ముందుగా రాసుకున్న దాని ప్రకారం మార్చాల్సి వచ్చిందని  చెప్తున్నారు.

సెట్ లో ఓ సీనియర్ గా  ఏదన్నా సలహాలు ఇవ్వటంలో వింతేమీ లేదు అని దాన్ని ఇలా హైలెట్ చేయటం ఏమీ బాగోలేదని అంటున్నారు. అలాగే తమ సొంత సినిమా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటంలో తప్పేమిటి అంటున్నారు. ఇక ఇలాంటి రూమర్స్ ఎవరికైనా కోపం తెప్పిస్తాయని, సినిమాపై నెగిటివ్ తీసుకొస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారట. ఏదమైనా దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఆ గీతను మీడియా కూడా దాటకుండా ఉంటే బాగుంటుంది కదా.


   

click me!