జంటను విడదీసిన బిగ్ బాస్, మెరీనా ఔట్.. కన్నీరు మున్నీరైన రోహిత్, టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరంటే..?

By Mahesh JujjuriFirst Published Nov 20, 2022, 11:36 PM IST
Highlights

బిగ్ బాస్ హౌస్ లో రోజులు దగ్గర పడే కొద్ది.. కంటెస్టెంట్స్ తో పాటు.. ఆడియన్స్ లో కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. ఇక వరుసగా ప్రతీ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. ఈసారి టాప్ 5 కంటెస్టెంట్స్ పై హింట్ ఇచ్చాడు బిగ్ బాస్. 

బిగ్ బాస్ హౌస్ లో రోజులు దగ్గర పడే కొద్ది.. కంటెస్టెంట్స్ తో పాటు.. ఆడియన్స్ లో కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. ఇక వరుసగా ప్రతీ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. ఈసారి టాప్ 5 కంటెస్టెంట్స్ పై హింట్ ఇచ్చాడు బిగ్ బాస్. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 నుంచి.. ఈ వారం ఎలిమినేషన్ అయిపోయింది. బిగ్ బాస్ ఈసారి హౌస్ లో ఉన్న ఏకైక జంటను విడదీశాడు. మదర్ ఇండియాగా పేరు తెచ్చికున్నా మెరీనా ఎలిమినేట్ అయ్యి.. హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇంట్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉండగా... మెరీనా బయటకు వచ్చేయడంతో.. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఇంకా 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. 

మెరీనాబయటకు రావడంతో రోహిత్ నార్మల్ గా ఉన్నట్టు కనిపించినా..దుఖాన్ని ఆపుకోలేకపోయాడు. అటు మెరీనా తన జర్నీ చూసుకుని.. బాగా ఎమోషనల్ అయ్యింది. ఇక  అంతకు ముందు నాగార్జున హౌస్ మెంట్స్ లో.. సరదా సరదా గేమ్స్ తో సందడి చేశారు. ఇందులో భాగంగా పది మంది కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా లోపలికి పిలిచి టాప్ 5 ఎవరు..? బోటమ్ 5 ఎవరు అని అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక అందరి దృష్టిలో టాప్  5లో రేవంత్, శ్రీహాన్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీసత్యలు ఉండగా.. బోటమ్ లో   రోహిత్, మెరీనా, ఇనయా,కీర్తి, రాజ్ ఉన్నారు. 

ఇక అందరూ ఇక నుంచి జాగ్రత్తగా ఆడకపోతే.. వాళ్లు వీళ్లు. వీళ్ళు వాళ్లు అయ్యే ఛాన్స్ ఉందంటూ నాగ్ హెచ్చరించారు. ఇక మెరీనా వెళ్తూ.. వెళ్తు.. హౌస్ లో ప్యూర్ ఎవరు..? ప్యూర్ కానిది ఎవరు అనే టాస్క్ ఇవ్వగా.. ఇంట్లో ప్యూర్ గా ఉండేది    రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్ పేర్లను పిక్ చేసింది మెరీనా, ఇక ప్యూర్ కానిది శ్రీహాన్, శ్రీ సత్య, ఫైమా, ఇనయాల పేర్లను స్టిప్ చేసింది. 

click me!