
కోలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు మణిర్నం. ఈ పార్టీకి అగ్రదర్శకులు శంకర్, మురగదాస్, గౌతమ్ మీనన్, లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, లింగుస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరంతా తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇంత సడెన్ గా మణిరత్నం ఎందుకీ పరార్టీ ఇచ్చచాడు.
ఇక ఈ గెట్ టు గెదర్కు సంబంధించిన వివరాలను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ వెల్లడించారు. తన సోషల్ మీడియాలో పేజ్ అయిన ఇన్ స్టా గ్రామ్ ఫొటోను షేర్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మణిరత్నంకు ధన్యవాదాలు తెలిపారు. టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ను కలవడం, మేకింగ్కు సంబంధించిన ఎన్నో విషయాలను మాట్లాడుకోవడం, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఈ క్షణాలు ఎంతో విలువైనవని తెలిపారు. అంతే కాదు అందరు దర్యకులకుమోం మంచి ఆతిథ్యాన్ని అందించినందుకు సుహాసినికి ధన్యవాదాలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది దర్శకులతో మణిరత్నం రెగ్యూలర్ టచ్లో ఉంటారు. కరోనా టైమ్ లోకూడా కలవం మాట్లాడటం కుదరకపోయినాతమిళ దర్శకులందరికీ జూమ్ కాల్ చేసి.. కాసేపు మాట్లాడారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల పొన్నియన్ సెల్వన్–2తో మణిరత్నం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేశ్ కనగరాజ్ లియో చిత్రంతో, శంకర్ గేమ్చేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు.