మలయాళ దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్‌ కన్నుమూత.. నాకు లైఫ్‌ ఇచ్చారంటూ మోహన్‌లాల్‌ ఆవేదన

Published : May 11, 2021, 09:29 AM IST
మలయాళ దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్‌ కన్నుమూత.. నాకు లైఫ్‌ ఇచ్చారంటూ మోహన్‌లాల్‌ ఆవేదన

సారాంశం

ప్రముఖ మలయాళ దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్‌ డెన్నీస్‌ జోసెఫ్‌ కన్నుమూశారు.  గుండెపోటు కారణంగా ఆయన సోమవారం రాత్రి మరణించినట్టు మలయాళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ప్రముఖ మలయాళ దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్‌ డెన్నీస్‌ జోసెఫ్‌ కన్నుమూశారు.  గుండెపోటు కారణంగా ఆయన సోమవారం రాత్రి మరణించినట్టు మలయాళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మలయాళ సూపర్‌ స్టార్స్ మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి బిగ్‌ స్టార్స్ తో సినిమాలు రూపొందించి, వారి సినిమాలకు పనిచేసి అగ్ర దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటర్‌గా పేరుతెచ్చుకున్నారు డెన్నీస్‌ జోసెఫ్‌.

జోసెఫ్‌ 1980లో తన కెరీర్‌ని ప్రారంభించారు. ఓ మ్యాగజీన్‌కి జర్నలిస్ట్ గా ఆయన జీవితం ప్రారంభమైంది. అట్నుంచి స్క్రిప్ట్ రైటర్‌గా మారారు. ఇలా దాదాపు 45 చిత్రాలకు ఆయన స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. ఓ ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో సూపర్‌ హిట్‌ చిత్రం `మను అంకుల్‌` ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి బెస్ట్ చిల్డ్రన్‌ చిత్రంగా 1988లో జాతీయ అవార్డు రావడం విశేషం. 

మలయాళం ఆల్‌టైమ్‌ హిట్స్ `న్యూ ఢిల్లీ` కి జోసెఫ్‌ స్క్రిప్ట్ రైటర్‌. 1987లో వచ్చిన ఈ సినిమా మమ్ముట్టి కెరీర్ కొత్త లైఫ్‌ని ఇచ్చింది. మోహన్‌లాల్‌ హీరోగా రూపొందిన బ్లాక్‌బస్టర్‌ `రాజవింతే మఖన్‌` చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. అలాగే మమ్ముట్టి, మోహన్‌లాల్‌ కలిసి నటించిన `నెం20 మద్రాస్‌ మెయిల్‌` చిత్రాలకు పనిచేశారు. 

 జోసెఫ్‌ స్క్రిప్ట్ రైటర్‌గా ప్రముఖ అగ్ర దర్శకులు ప్రియదర్శన్‌ వద్ద పనిచేశారు. ఆయన రూపొందించిన `గీతాంజలి`కి కూడా పనిచేశారు. ప్రస్తుతం మరో స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందట. ఆ సినిమాని త్వరలో పట్టాలెక్కించాలని భావించారు. కానీ ఇంతలోనే ఆయన గుండెపోటుతో మరణించడం అత్యంత బాధాకరం. సోమవారం రాత్రి తన ఇంటి వద్దే ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి వెళ్లేలోపే ఆయన మార్గమధ్యంలో కన్నుమూసినట్టు వైద్యులు నిర్ధారించారు.

జోసెఫ్‌ మృతి పట్ల మోహన్‌లాల్‌ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. `నన్ను ఇలా తయారు చేసింది అతనే` అని పేర్కొన్నారు. ఆయన మరణం మలయాళ చిత్ర పరిశ్రమకి తీరని లోటని, ఆయన లేరనే వార్త కలచివేస్తుందని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే మమ్ముట్టి, సురేష్‌ గోపీ వంటి ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చనిపోయే ముందు శ్రీదేవి నన్ను కలిసింది.. అప్పుడు అందరం కలిసి గెట్ టుగెదర్.!
Ram Charan Peddi Movie: మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే