Maheshbabu: ఐటీ మినిస్టర్‌గా మహేష్.. అంతా తూచ్‌..

Published : Jul 17, 2022, 11:54 AM IST
Maheshbabu: ఐటీ మినిస్టర్‌గా మహేష్.. అంతా తూచ్‌..

సారాంశం

`SSMB28` చిత్ర నేపథ్యం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కొన్ని రూమర్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మహేష్‌ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు లైనప్‌లో క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `SSMB28` వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందబోతున్న చిత్రమిది. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుంది. `అతడు`, `ఖలేజా` తర్వాత మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. అలాగే `మహర్షి` తర్వాత మహేష్‌-పూజా కలిసి చేస్తున్న సినిమా కావడం విశేషం. రెండు రకాలుగానూ హిట్‌ కాంబినేషన్స్‌ సెట్‌ అయ్యాయి. పైగా త్రివిక్రమ్‌.. `అలా వైకుంఠపురములో` హిట్‌ తో జోష్‌లో ఉన్న త్రివిక్రమ్‌ నుంచి వస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇదిలా ఉంటే ఈ చిత్రం నేపథ్యం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కొన్ని రూమర్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మహేష్‌ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. గతంలో `భరత్‌ అనే నేను`లో ఆయన ముఖ్యమంత్రిగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్‌ సినిమాలో ఐటీ మంత్రిగా కనిపించబోతున్నారనే టాక్‌ వినిపిస్తుంది. 

సినిమా కూడా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ చిత్రమని ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. అయితే ఇందులో నిజం లేదంటోంది యూనిట్‌. పూర్తి కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందట. మాటల మాంత్రికుడి స్టయిల్‌ టేకింగ్‌తో, నీట్‌గా సాగేలా ఉంటుందట. కాకపోతే ఫ్యాన్స్ కి కావాల్సిన యాక్షన్‌ పుష్కలంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ నుంచి వినిపిస్తున్న టాక్. రాజకీయ నేపథ్యానికి సంబంధం లేదని, అవన్నీ ఉట్టి రూమర్లే అని కొట్టిపారేస్తుంది యూనిట్‌. 

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఆగస్ట్ మూడో వారంలో రెగ్యూలర్‌ షూటింగ్‌ని స్టార్ట్ చేయనున్నారు. ఆ లోపు త్రివిక్రమ్‌ పక్కాగా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారట. శరవేగంగా చిత్రీకరించాలని, గతంలో మాదిరిగా చాలా ఫాస్ట్ గా ఈ సినిమా షూట్‌ చేయాలని భావిస్తున్నారట. త్వరగా ఈ సినిమాని పూర్తి చేసుకుని రాజమౌళి మూవీకి వెళ్లిపోవాలని మహేష్‌ భావిస్తున్నట్టు సమాచారం.ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం