Mahesh Babu:మహేష్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారే..ఇదేం కామెడీ

Published : Jul 26, 2022, 09:28 AM IST
 Mahesh Babu:మహేష్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారే..ఇదేం కామెడీ

సారాంశం

మహేష్ బాబు సూపర్ స్టార్. ఆయనకు ఉన్న క్రేజ్ వేరు. సినిమా ఎలా ఉన్నా థియేటర్స్ దగ్గర జనం ఓ రేంజిలో ఉంటారు. అయితే అదే పరిస్దితి ఆయన అభిమానిగా ఓ హీరోని వేరే సినిమాలో చూపిస్తే ఉంటుందా? లేకపోతే ట్రోల్ చేస్తారా


కొన్ని విషయాలు కామెడీగా ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ లు, ట్రెండింగ్ లు గమ్మత్తుగా ఉంటాయి. అలాగే ఇప్పుడు ట్విట్టర్ లో మహేష్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తూ ట్రెండ్ మొదలైంది. అందుకు కారణం చాలా చిత్రంగా ఉంది. అది థాంక్యూ సినిమా డిజాస్టర్ కావటం. 

అక్కినేని నాగచైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మార్నింగ్ షోకే ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చేసింది. నాగచైతన్య కెరీర్ లో అతి తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా థాంక్యూ నిలిచింది  తన ఎదుగుదలకు కారణమైన వారికి కృత‌జ్ఞ‌త‌ చెబుతూ ఓ యువకుడు సాగించి జర్నీ కథగా  ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల లో విడుదలైన భారీ చిత్రాల్లో థాంక్యూ ఒకటి కావడంతో నాగచైతన్య సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే దారుణమైన నిరాశ మిగిల్చింది. ఈ సినిమాలో నాగచైతన్య..మహేష్ కు అభిమానిగా కనపడతారు. 

దాంతో మహేష్ బాబు అభిమానులు జూలై 21 న ప్రీమియర్ షోలుకు వెళ్లి సక్సెస్ చేసారు. అయితే అవి లిమిటెడ్ ప్రీమియర్స్. అయితే అవేమీ సినిమా ఓపినింగ్స్ కు సాయపడలేదు. సినిమా నిలబెట్టడానికి అసలు కలిసి రాలేదు. దాంతో మీ మహేష్ అభిమానిగా చేసిన సినిమా ఇలా డిజాస్టర్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అది చూసి విస్తుపోవటం మహేష్ ఫ్యాన్స్ వంతు అవుతోంది. 

ఇక ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఎపిక్ డిజాస్టర్ రిజల్ట్ పొందింది. ఈ సినిమా జీరో షేర్ వరల్డ్ వైడ్ అని తేల్చారు. కలెక్షన్స్ తో వచ్చిన కొద్దో గొప్పో మొత్తం రెంటల్ బేసిస్ మీద లెక్కేస్తే షేర్ ఏమీ మిగలదు అని ట్రేడ్ అంటోంది. అంత దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి.  మిడ్ రేంజ్ హీరోల కంటే థాంక్యూ సినిమాకు తక్కువ వసూళ్లు రావడం దర్శకనిర్మాతలకు , అభిమానులకు షాక్ కు గురిచేస్తోంది. ఈ సినిమా 24 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు.  మౌత్ టాక్ నెగెటివ్ గా ఉండటంతో థాంక్యూ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం అసాధ్యం అంటున్నారు.   

దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమాతోనే నాగ‌చైత‌న్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ దిల్‌రాజు సంస్థ‌లో నాగ‌చైత‌న్య చేసిన సినిమా ఇది. ఇందులో రాశీఖ‌న్నా, మాళ‌వికానాయ‌ర్‌, అవికాగోర్ హీరోయిన్లుగా న‌టించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు