అరుదైన సీన్‌.. ఒకేతెరపై మహేష్‌, రణ్‌వీర్‌ సింగ్‌.. ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ

By Aithagoni RajuFirst Published Dec 26, 2020, 2:32 PM IST
Highlights

మహేష్‌బాబు, రణ్‌వీర్‌ సింగ్‌ లను ఒకే తెరపై పక్క పక్కన చూడబోతున్నారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. వీరిద్దరని చూసేది వెండితెరపై కాదు, బుల్లితెరపై. మహేష్‌బాబు, రణ్‌వీర్‌ సింగ్‌ కలిసి ఫస్ట్ టైమ్‌ ఓ యాడ్‌ చేశారు. 

మహేష్‌బాబు.. తెలుగు సూపర్‌ స్టార్‌.. రణ్‌వీర్‌ సింగ్‌ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌. వీరిద్దరు కలిసి తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే. వారి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అలాంటి అరుదైన దృశ్యం కనిపించబోతుంది. మహేష్‌బాబు, రణ్‌వీర్‌ సింగ్‌ లను ఒకే తెరపై పక్క పక్కన చూడబోతున్నారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. వీరిద్దరని చూసేది వెండితెరపై కాదు, బుల్లితెరపై. 

మహేష్‌బాబు, రణ్‌వీర్‌ సింగ్‌ కలిసి ఫస్ట్ టైమ్‌ ఓ యాడ్‌ చేశారు. థంమ్స్ అప్‌ యాడ్‌ చేశారు. దీనికి కోసం వీరిద్దరు కలిసి నటించారు. డీ గ్లామర్‌ లుక్‌లో, సాహసాలు చేశారు. థంమ్స్ అప్‌ యాడ్‌ కోసం పోరాడారు. అయితే ఇది చాలా ఆనందాన్నిచ్చిందని ఇద్దరు హీరోలు చెబుతున్నారు. ఈ మేరకు ఇన్‌ స్టా స్టోరీలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించడంతోపాటు అభినందించుకున్నారు. మహేష్‌ని రణ్‌వీర్‌ బిగ్‌ బ్రదర్‌గా అని చెప్పగా, మహేష్‌ కూడా ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో విశేషంగా వైరల్‌ అవుతుంది. 

ఇక మహేష్‌బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌. అలాగే రణ్‌వీర్‌ సింగ్‌ `83`లో నటిస్తున్నారు. కపిల్‌దేవ్‌ బయోపిక్‌ చిత్రమిది. దీంతోపాటు `సూర్యవంశీ`లో గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. అలాగే `జయేష్‌భాయ్‌ జోర్దార్‌` అనే సినిమాలోనూ హీరోగా నటిస్తున్నారు. 

click me!