గంగానదిలో అమ్మ ఇందిరా దేవి అస్థికలు కలిపిన మహేష్... ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లారంటే!

By Sambi ReddyFirst Published Oct 4, 2022, 11:57 AM IST
Highlights

తల్లి ఇందిరా దేవి మరణాంతర కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు మహేష్. ఆమె అస్థికలు గంగా నదిలో కలిపేందుకు హరిద్వార్ వెళ్లారు. పుణ్యక్షేత్రంలో మహేష్ పూజలు నిర్వహిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. 
 


గత నెల 28న కృష్ణ సతీమణి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందారు. 70 ఏళ్ల ఇందిరా దేవి కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇందిరా దేవి మృతిని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇందిరా దేవి మృతికి చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది. ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేశారు. 

మహాప్రస్థానంలో కొడుకు మహేష్ ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా పవిత్ర పుణ్యక్షేత్రం హరిద్వార్ కి మహేష్ వెళ్లారు. గంగానదిలో తల్లి అస్థికలు కలిపారు. పండితుల సమక్షంలో, వేద మంత్రాల మధ్య ఈ కార్యక్రమం మహేష్ పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మహేష్ బాబు తెల్లని పట్టు వస్త్రాలు ధరించారు. మహేష్ కి తోడుగా ఆదిశేషగిరిరావు, గల్లా జయదేవ్ వెళ్లారు. 

An emotional immerses the ashes of his late mother in Haridwar

🎥Pallav Paliwal pic.twitter.com/OP2jyhv9WV

— Jagran English (@JagranEnglish)

తల్లి దశదిన కర్మతో పాటు సంప్రదాయం ప్రకారం అని క్రతువులు పూర్తి చేసిన తర్వాత మహేష్ షూటింగ్ కి సిద్ధం కానున్నారు. ఇటీవల మహేష్-త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలుకాల్సి ఉంది. మహేష్ 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. రెండో సారి మహేష్-పూజా హెగ్డే జత కడుతున్నారు. గతంలో వీరిద్దరూ మహర్షి చిత్రంలో నటించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా... థమన్ సంగీతం అందిస్తున్నారు. 

click me!