మహేష్ తో మూవీ.. మా వల్ల కాదు?

By Prashanth MFirst Published Feb 21, 2019, 2:43 PM IST
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమాను నిర్మించాలని ఎవరికీ ఉండదు. డేట్స్ దొరికితే నెక్స్ట్ డే నే కథను సెట్ చేసి వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పట్టాలెక్కించడానికి ట్రై చేస్తుంటారు. అయితే మహేష్ శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ కి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఆయనతోనే సినిమా చేయలేని పరిస్థితి.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమాను నిర్మించాలని ఎవరికీ ఉండదు. డేట్స్ దొరికితే నెక్స్ట్ డే నే కథను సెట్ చేసి వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పట్టాలెక్కించడానికి ట్రై చేస్తుంటారు. అయితే మహేష్ శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ కి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఆయనతోనే సినిమా చేయలేని పరిస్థితి.

జనతా గ్యారేజ్ - రంగస్థలం సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న ఈ బడా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు దారుణమైన నష్టాలను మిగిల్చాయి. లెక్కకు మించిన బడ్జెట్ తో సవ్యసాచిపై పెట్టుబడి పెట్టి అతిగా ఆశపడిన మైత్రికి గట్టిదెబ్బే తగిలింది;. ఇక వరుస ప్లాపులను ఎదుర్కొంటున్న రవితేజ - శ్రీనువైట్ల కాంబోని కలిపి చేసిన అమర్ అక్బర్ ఆంటోని కూడా తీవ్ర నష్టాలను మిగిల్చింది. 

దీంతో మైత్రి ప్రొడక్షన్స్ మరో పెద్ద సినిమాను నిర్మించడానికి సాహసం చేయలేని పరిస్థితి వచ్చిందని సమాచారం. అందుకే మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. సుకుమార్ కథను ఇంకా సెట్ చేయకపోవడంతో మహేష్ కూడా మైండ్ చేంజ్ చేసుకొని అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.                                            

ఇక మైత్రి మోవి మేకర్స్ సంస్థ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ అనే ఒక సినిమా చేస్తోంది. అలాగే సుకుమార్ రైటింగ్స్ లో రూపొందుతున్న వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ లోనే రూపొందుతోంది. కొంచెం చిన్న సినిమాలతో నష్టాలను రికవర్ చేసుకునేంత వరకు పెద్ద సినిమాలను ఏ మాత్రం టచ్ చేయకూడదని మైత్రి మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నట్లు టాక్. 

click me!