బోర్డర్ లోకి అడుగుపెడుతున్న మహేష్!

By AN TeluguFirst Published May 31, 2019, 12:47 PM IST
Highlights

ఇటీవల 'మహర్షి' సినిమాతో సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమాకి సిద్ధమవుతున్నాడు.

ఇటీవల 'మహర్షి' సినిమాతో సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమాకి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది 'ఎఫ్ 2' చిత్రంతో సక్సెస్ అందుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి.. మహేష్ బాబుని డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఈరోజు సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాకి 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. సినిమా టైటిల్ పోస్టర్ ని బట్టి ఇది మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు అనీల్ రావిపూడి.. సినిమా మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నారని చెప్పారు. 

మహేష్ అభిమానులకు ఈ సినిమా ఐఫీస్ట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాతో ఆయనకి మంచి హిట్ ఇస్తానని నమ్మకంగా చెబుతున్నారు. గతంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు పోషించారు కానీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించడం ఇదే తొలిసారి. దిల్ రాజు, అనీల్ సుంకర, మహేష్ బాబు ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటారు.

చాలా ఏళ్ల తరువాత నటి విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

click me!