మహేష్‌బాబు మరో భారీ మల్టీప్లెక్స్.. `ఏఎంబీ`ని మించి.. ఎక్కడో తెలుసా?

మహేష్‌బాబు ఇప్పుడు మరో మల్టీప్లెక్స్  నిర్మిస్తున్నారు. ఈ సారి `ఏఎంబీ`ని మించి ఉండబోతుందట. ఓ భారీ థియేటర్‌ స్థానంలో మహేష్‌ మల్టీప్లెక్స్ నిర్మిస్తుండటం విశేషం.

Google News Follow Us

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నెమ్మదిగా వివిధ వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆయన క్లాత్స్ వేర్‌ బ్రాండ్‌ని నిర్వహిస్తున్నారు. మరోవైపు `ఏఎంబీ`తో సినిమా థియేటర్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అలాగే రియల్‌ ఎస్టేట్‌ కూడా గట్టిగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో మల్టీప్లెక్స్  నిర్మిస్తున్నారు. ఈ సారి `ఏఎంబీ`ని మించి ఉండబోతుందట. ఓ భారీ థియేటర్‌ని ఆయన నిర్మించబోతున్నారని తెలుస్తుంది. 

అయితే మహేష్‌బాబు, ఏసియన్‌ గ్రూప్‌(సునీల్ నారంగ్‌)తో కలిసి `ఏఎంబీ`ని నిర్వహిస్తున్నారు. మరోసారి ఈ ఇద్దరు కలిసి బెంగుళూరులో భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. అయితే అక్కడ ఓ చరిత్ర గల థియేటర్ స్థానంలో వీరి మల్టీప్లెక్స్ నిర్మిస్తుండటం విశేషం.  బెంగుళూరులో దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న ఫేమస్‌ కపాలి సినిమా థియేటర్‌ ని మూడేళ్ల క్రితమే కూల్చారు. బెంగుళూరులోని గాంధీనగర్‌లో ఈ థియేటర్‌ ఉంది. అక్కడ భారీగా మాల్‌ని నిర్మిస్తున్నారు. అందులో ఏఎంబీ మల్టీప్లెక్స్ కూడా నిర్మిస్తున్నారట. 

కన్నడ ఆడియెన్స్ ని ఐదు దశాబ్దాలుగా అలరిస్తుంది కపాలి థియేటర్‌. బెంగుళూరు సెంటర్‌లోని గాంధీ నగర్లో ఈ థియేటర్‌ ఉండటం ఓ విశేషమైతే, ఇది అతి పెద్ద థియేటర్‌ కావడం మరో విశేషం. దీంతో ఈ థియేటర్‌కి పెద్ద చరిత్రనే ఉంది. ఆ స్థానంలో మహేష్‌బాబు మల్టీప్లెక్స్ వస్తుండటంతో సినీ ప్రియుడు హ్యాపీగా ఫీలవుతున్నారు. 

కపాలి థియేటర్‌ హిస్టరీ చూస్తే.. 1968లో సుబేదార్‌ చత్రం రోడ్డులో 44వేల చదరపు అడుగు విస్తీర్ణంలో ఈ కపాలి సినిమా నిర్మించారు. అప్పటి ప్రధాని మోరార్జీ దేశాయ్‌ దీన్ని ప్రారంభించడం విశేషం. అప్పట్లోనే ఈ థియేటర్‌ని 1465సీట్ల కెపాసిటీతో నిర్మించడంతో ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ గా రికార్డ్ సృష్టించింది. నాలుగేళ్ల క్రితం కపాలి థియేటర్‌ యాజమానులు దాసప్ప సోదరులు ఈ స్థలాన్ని బెల్గాం వ్యాపారికి విక్రయించారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ జయన్న ఈ కాపాలి సినిమాను లీజుకున్నారు. ఐదేళ్ల లీజు అనంతరం థియేటర్‌ని అమ్మేశారు. 

కపాలి థియేటర్‌లో కన్నడ చిత్రాలే కాదు, హిందీ, ఇంగ్లీష్‌ మూవీస్‌ కూడా ప్రదర్శించబడేవి. రాజ్ కుమార్‌ నటించిన ఎన్నో సినిమాలు ఇందులోరిలీజ్‌ అయ్యాయి. దీంతో ఈ థియేటర్‌ని కన్నడ ఆడియెన్స్ ఓ ఎమోషన్‌గా ఫీలవుతారు. ఇక ఇందులో శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర కలిసి నటించిన `ఓం` చిత్రాన్ని ముప్పై సార్లు ఈ థియేటర్‌లో రిలీజ్‌ చేయడం విశేషం. అయితే కొన్నాళ్ల తర్వాత ఈ సినిమా సీటింగ్‌ కెపాసిటీని 1112కి తగ్గించారు. చివరగా 2017లో `హులిరాయ` అనే చిత్రం ఈ థియేటర్‌లో ప్రదర్శించిన చివరి చిత్రంగా నిలిచింది.
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...