విదేశాల నుంచి కొనుగోలు చేసుకున్న తన లగ్జరీ కారుకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దళపతి విజయ్ పెట్టుకున్న పిటీషన్ని మద్రాస్ హైకోర్ట్ కొట్టేసింది.
దళపతి విజయ్ కి మద్రాస్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. లక్ష రూపాయలు జరిమానా విధించింది. ఈ సందర్భంగా రీల్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే.. ఇటీవల ఇంగ్లాండ్ నుంచి విజయ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్ కారుని ఆయన దిగుమతి చేసుకున్నారు. అయితే ఈ కారుకు సంబంధించిన ట్యాక్స్ ని ఆయన చెల్లించలేదు. పైగా తనకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టుకు పిటీషన్ దాఖలు చేశారు.
విజయ్ పిటీషన్ని మంగళవారం మద్రాస్ హైకోర్ట్ కొట్టేసింది. ట్యాక్స్ చెల్లించనందుకు ఆయనకు రూ. లక్ష జరిమానా విధించింది. అందేకాదు రీల్ హీరోలు ట్యాక్స్ కట్టేందుకు నిరాకరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్గా మారింది. ఇక విజయ్ కొనుగోలు చేసిన కారు ఖరీదు సుమారు రూ.6 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.
కాగా ప్రస్తుతం విజయ్ `బీస్ట్` చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది.