లిరిసిస్ట్ చంద్రబోస్ కుటుంబంలో విషాదం!

Siva Kodati |  
Published : May 20, 2019, 03:46 PM ISTUpdated : May 20, 2019, 08:16 PM IST
లిరిసిస్ట్ చంద్రబోస్ కుటుంబంలో విషాదం!

సారాంశం

సినీ గేయ రచయిత చంద్రబోస్ కుటుంబంలో విషాదం నెలకొంది. చంద్రబోస్ తల్లి మదనమ్మ సోమవారం మృతి చెందారు. 

సినీ గేయ రచయిత చంద్రబోస్ కుటుంబంలో విషాదం నెలకొంది. చంద్రబోస్ తల్లి మదనమ్మ సోమవారం మృతి చెందారు. గుండె పోటు రావడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. దీనితో సినీ ప్రముఖులంతా చంద్రబోస్ కు తల్లి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. 

వారి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని చల్లగరిగలో చంద్రబోస్ తల్లి అంత్యక్రియలు జరగనున్నాయి. మదనమ్మకు మొత్తం నలుగురు సంతానం కాగా వారిలో చివరి వాడు చంద్రబోస్. చంద్రబోస్ తన అద్భుతమైన సాహిత్యంతో తెలుగు సినీ ప్రియులని అలరిస్తున్నాడు. స్టార్ లిరిసిస్ట్ గా టాలీవుడ్ లో ఎదిగారు. 

గత ఏడాది చంద్రబోస్ సింగిల్ కార్డులో రంగస్థలం చిత్రానికి అందించిన పాటలు అందరిని అలరించాయి. సుకుమార్, చంద్రబోస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు మ్యూజికల్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. 

PREV
click me!

Recommended Stories

Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?
Sai Pallavi House: సింపుల్ గా సాయి పల్లవి సొంత ఇల్లు, స్టార్ హీరోయిన్ హౌస్ ఇలా కూడా ఉంటుందా?