వేషం ఇస్తానని పిలిచి..కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి,కేసు

By team teluguFirst Published Feb 23, 2021, 4:55 PM IST
Highlights

సినీ నటికి హత్యా బెదిరింపులు చేసిన  కాలేజీ నిర్వాహకుడిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పుళల్‌ సమీపం సూరపట్టుకు చెందిన మహ్మద్‌ ఇబ్రహీం కుమార్తె సమీరా సినీ నటి. ఈమె పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. 

సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని పిలిచి అత్యాచారం చేయటం, వ్యభిచార వృత్తిలో దించటానికి ప్రయత్నించటం వంటివి ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయి. రోజు ఇలాంటి వార్తలు వస్తున్నా సినిమాలపై మోజుతో ముందు వెనుక చూసుకోకుండా, అవతలి వారి వివరాలు తెలుసుకోకుండా ముందుకు వెళ్లి మునిగిపోతున్నారు కొంతమంది అమ్మాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...సినీ నటికి హత్యా బెదిరింపులు చేసిన  కాలేజీ నిర్వాహకుడిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పుళల్‌ సమీపం సూరపట్టుకు చెందిన మహ్మద్‌ ఇబ్రహీం కుమార్తె సమీరా సినీ నటి. ఈమె పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. కోడువల్లి జయసూర్య ఇంజినీరింగ్‌ కాలేజ్ నిర్వాహకుడు గోవిందరాజ్‌ తాను నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు అవకాశం ఇస్తానని ఆహ్వానించారని అన్నారు.

అక్కడికి వెళ్లగా కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. తాను ఇంట్లో ఉన్న సమయంలో జయకుమార్, నక్కీరన్, పూర్ణిమ సహా ఎనిమిది మంది వచ్చి కేసు వెనక్కి తీసుకోవాలని లేకుంటే హత్య చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

click me!