లెజెండరీ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూత..

Published : Jun 10, 2021, 07:52 AM ISTUpdated : Jun 10, 2021, 08:07 AM IST
లెజెండరీ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూత..

సారాంశం

లెజెండరీ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

లెజెండరీ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. ట్రీట్‌మెంట్‌ అనంతరం కోలుకున్నారు. కరోనా నెగటివ్‌ వచ్చింది. అయితే చాలా రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగానే ఆయన కొన్ని రోజులుగా డయాలసిస్‌పై ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా హార్ట్ ఎటాక్‌ రావడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

ఘంటసాల రత్నకుమార్‌ చిత్ర పరిశ్రమలోనే రాణిస్తున్నారు. ఆయన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా  రాణిస్తున్నారు.

ఘంటసాల వెంకటేశ్వరరావు(ఘంటసాల), సావిత్రిలకు ఎనిమిది మంది పిల్లలు. వారిటో నలుగురు కూతుళ్లు, నలుగురు కుమారులున్నారు. వారిలో పెద్దకుమారుడు విజయ కుమార్‌ కాగా, రెండో కుమారుడు రత్నకుమార్‌. వీరితోపాటు రవికుమార్‌, శంకర్‌ కుమారులు చిన్నవాళ్లు. ఘంటసాల భక్తిరసగీతాలు, పౌరాణిక గీతాలు, సినిమా పాటలు ఇలా అన్ని రకాల పాటలు పాడి శ్రోతల మదిలోనిలిచిపోయాడు. ముఖ్యంగా భగవద్గీత ఆలాపణ ఓ హిస్టరీగా నిలిచిపోయింది. 

ఇక ఘంటసాల రత్నకుమార్‌ ఇప్పుడు చాలా ఏళ్లుగా డబ్బింగ్‌ ఆర్టిస్టుగానే రాణిస్తున్నారు. ఆయన ఒకేసారి, ఏకకాలంలో ఎనిమిది గంటలపాటు డబ్బింగ్‌ చెప్పి రికార్డు సృష్టించారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్ లోకి ఎక్కారు. ఆయన గతంలో అమేజింగ్‌ వరల్డ్ రికార్డ్ ని నెలకొల్పారు. తమిళనాడు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ కూడా సృష్టించారు. 1076 తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, సంస్కృతం సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. పదివేల తెలుగు, తమిళ సీరియల్స్ కి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. 50కిపైగా డక్యూమెంటరీలకు వాయిస్‌ అందించారు. 

ఇండస్ట్రీ తనకు ఎంతో ఇచ్చిందని, కొంతైనా తిరిగి ఇవ్వాలనేది ఆయన తాపత్రయం. ఆయన 12 గంటలపాటు నిర్వరామంగా డబ్బింగ్‌ చెప్పి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఇంతలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.  ఆయనకు డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా దక్కింది. ఇతర అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఘంటసాల రత్నకుమార్‌ పట్ల చిత్ర పరిశ్రమ పెద్దలు సంతాపం తెలియజేస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌