కియారా అద్వానీ షాకింగ్ రెమ్యునరేషన్!

By Udayavani DhuliFirst Published Jan 14, 2019, 11:16 AM IST
Highlights

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకుంది. రీసెంట్ గా ఆమె నటించిన 'వినయ విధేయ రామ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకుంది. రీసెంట్ గా ఆమె నటించిన 'వినయ విధేయ రామ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ప్రస్తుతం కియారా కొన్ని బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసింది. అందులో ఒకటి కరణ్ జోహార్ ఫిల్మ్. బాలీవుడ్ లో ఆమెకి క్రేజ్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ క్రేజ్ ని దక్కించుకుంది.

ఆ క్రేజ్ ని ఈ బ్యూటీ క్యాష్ చేసుకుంటుంది. ఒక్కో సినిమాకి దాదాపు రూ.1.25 కోట్లను డిమాండ్ చేస్తుందట. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుందని సమాచారం.

రీసెంట్ గా గోపీచంద్-సంపత్ నంది కాంబినేషన్ లో రాబోయే సినిమాలో హీరోయిన్ గా కియారాని తీసుకోవాలనుకున్నారు. దీనికోసం ఆమెను సంప్రదించగా.. ఆమె కోటి ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసిందట. దీంతో షాక్ తిన్న నిర్మాతలు మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారట. 

click me!