అమ్మాయిలకు ఎదవలే నచ్చుతారట.. `చావు కబురు చల్లగా` ట్రైలర్‌

By Aithagoni RajuFirst Published Mar 5, 2021, 6:41 PM IST
Highlights

`చావు కబురు చల్లగా` చిత్ర ట్రైలర్‌ని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. శవాలను శ్మశాన వాటికకి తీసుకెళ్లే అంబులెన్స్ డ్రైవర్‌ భర్త చనిపోయిన అమ్మాయిని శ్మశాన వాటికలో చూసి ప్రేమించడమనే కథాంశంతో తిరిగే చిత్రమని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 

`ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ కార్తికేయ హీరోగా `చావు కబురు చల్లగా` చిత్రం రూపొందుతుంది. కౌశిక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. శవాలను శ్మశాన వాటికకి తీసుకెళ్లే అంబులెన్స్ డ్రైవర్‌ భర్త చనిపోయిన అమ్మాయిని శ్మశాన వాటికలో చూసి ప్రేమించడమనే కథాంశంతో తిరిగే చిత్రమని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 

Tonnes of Fun + Too much of Craziness = 𝗧𝗵𝗲𝗮𝘁𝗿𝗶𝗰𝗮𝗹 𝗧𝗿𝗮𝗶𝗹𝗲𝗿 : https://t.co/8ZxgMYIFay pic.twitter.com/1syexEttF6

— GA2 Pictures (@GA2Official)

కార్తీకేయ చనిపోయిన శవాలను అంతిమ యాత్రకి తీసుకెళ్లే బస్తీ బాలరాజుగా నటిస్తున్నారు. భర్త చనిపోయిన అమ్మాయిగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. `ఎవరు కావాలి మీకు` అంటే.. `ఎవరొచ్చినా ఫర్వాలేదు అంతిమయాత్రకి పట్టుకెళ్లిపోతాను..` అని కార్తికేయ చెప్పడం, `మా అబ్బాయిగారి ఫ్రెండా?` అంటే `మీ అమ్మాయిగారీ బాయ్‌ఫ్రెండ్‌` అని చెప్పడం, `నువ్వు నెంబర్‌ 1 వెదవవి` అని లావణ్య త్రిపాఠి అంటే `అమ్మాయిలకు ఎట్టాగూ ఎదవలే నచ్చుతారటగా..`, `ఓయ్‌ పిల్లా నువ్వు నాకు ఫిక్స్ అయిపో..`, `శ్మశానంలో మీ ఆయన పక్కన ఇచ్చే చోటేదో నీ మనసులో ఇవ్వొచ్చుగా`, `ఎక్కువ చేస్తే నీకు ఒరిజినల్‌ పడిపోతుంది` అంటూ కార్తికేయ చెప్పే డైలాగులతో కూడిన ట్రైలర్‌ ఫన్నీగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.
 

click me!