కృష్ణుడు కౌరవుల వైపు నిలబడితే.. యుద్ధం లేకుండా మహాభారతాన్ని చూస్తే?

By Aithagoni RajuFirst Published Feb 1, 2021, 5:57 PM IST
Highlights

కార్తీ హీరోగా బక్కియ రాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `సుల్తాన్‌`. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ఇందులో `కేజీఎఫ్‌` విలన్‌ గరుడ పాత్ర ధారి కూడా నటిస్తుండటం వివేషం. తాజాగా విడుదలైన టీజర్‌ బాగా ఆకట్టుకోవడంతోపాటు అంచనాలను పెంచుతుంది.

`మహాభారతం చదివావా.. భారతంలో కృష్ణుడు వంద అవకాశాలిచ్చాన కౌరవులు మారలేదు. నువ్వు ఇవ్వమంటుంది ఒక్క అవకాశమే కాదా ఇస్తా` అని విలన్లు అంటే `మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే..అదే మహాభారతాన్ని ఒక్కసారి యుద్ధం లేకుండా ఊహించుకోండి సర్` అని హీరో కార్తీ అంటున్నాడు. ఇది ఆయన నటిస్తున్న `సుల్తాన్‌` చిత్ర టీజర్‌లోని డైలాగులు. 

బక్కియ రాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `సుల్తాన్‌`. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ఇందులో `కేజీఎఫ్‌` విలన్‌ గరుడ పాత్ర ధారి కూడా నటిస్తుండటం వివేషం. తాజాగా విడుదలైన టీజర్‌ బాగా ఆకట్టుకోవడంతోపాటు అంచనాలను పెంచుతుంది. `మహాభారతం` రివర్స్ లో ఈ సినిమా కథ సాగుతుందని తాజాగా టీజర్‌లోని డైలాగులను వింటే అర్థమవుతుంది. చాలా ఆసక్తికరంగా సాగిందీ టీజర్‌. భయంకరమైన విలన్లు, స్టయిలీష్‌గా కార్తీ ఎంట్రీ హైలైట్‌గా నిలిచాయి. రష్మిక మందన్నా కూడా ఆకట్టుకునేలా ఉంది.

Presenting the teaser of , a perfect family entertainer. - https://t.co/3bUFlPbu72 💪

— Rashmika Mandanna (@iamRashmika)

ఇక డ్రీమ్స్ వాయిర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ ఆర్‌ప్రకాష్‌ బాబు, ఎస్‌ ఆర్‌ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళంలో విడుదల కానున్నట్టు తెలుస్తుంది.

click me!