సావిత్రికి జీవం పోసింది 'మహానటి'!

Published : May 11, 2018, 06:21 PM IST
సావిత్రికి జీవం పోసింది 'మహానటి'!

సారాంశం

అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' 

అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులతో పాటు రాజకీయనాయకులు కూడా ఈ సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. తాజాగా లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఈ సినిమాను చూసి కన్నీరు ఆపుకోలేకపోయానని అన్నారు. 

''సావిత్రిపై ఎంతో ప్రేమతో ఈ సినిమాను తెరకెక్కించారు. అసామాన్య కళాకారిణి. ఈ సినిమా ఆ గొప్ప నటికి మళ్ళీ జీవం పోసింది. సినిమాను చూసి కన్నీరు ఆపుకోవడం చాలా కష్టం. ప్రధాన పాత్రలు పోషించిన కీర్తి సురేష్, సమంత వంటి వారు అద్భుత నటన కనబరిచారు. ఈ సినిమా నన్ను కదిలించింది. చాలా కాలం వరకు నా హృదయంలో నిలిచిపోతుంది'' అని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?