జై మహారాష్ట్ర, జై శివాజీ.. ముంబై వచ్చే ముందు కంగన ట్వీట్

By Satish ReddyFirst Published Sep 9, 2020, 10:05 AM IST
Highlights

ముంబై మినీ పాకిస్థాన్‌లా తయారైందంటూ కంగన చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాలు ముఖ్యంగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కంగన మాత్రం తన వ్యాఖ్యల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఈ రోజు ముంబైలో అడుగుపెడుతున్న సందర్భంగా కంగన ఆసక్తికర ట్వీట్ చేసింది.

వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ బుధవారం రోజు ముంబైలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న కంగనను అడ్డుకునేందుకు శివసేన వర్గాలు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ బ్యూటీ వై క్యాటగిరి భద్రతను ఇచ్చింది.

ముఖ్యంగా ముంబై మినీ పాకిస్థాన్‌లా తయారైందంటూ కంగన చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాలు ముఖ్యంగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కంగన మాత్రం తన వ్యాఖ్యల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఈ రోజు ముంబైలో అడుగుపెడుతున్న సందర్భంగా కంగన ఆసక్తికర ట్వీట్ చేసింది.

`నేను ధైర్యం, శౌర్యం, త్యాగానికి ప్రతీక అయిన లక్ష్మీ భాయ్‌ పాత్రలో నటించాను. ఈ రోజు నన్ను నా సొంత రాష్ట్రం మహారాష్ట్రకు రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ నేను రాణీ లక్ష్మీ భాయ్‌ మార్గంలోనే నడుస్తాను. అన్యాయాలకు వ్యతిరేఖంగా నా గొంతును వినిపిస్తూనే ఉంటాను. జై మహారాష్ట్రా, జై శివాజీ` అంటూ ట్వీట్ చేసింది కంగనా. ముంబై ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంల కంగన ట్వీట్‌ ఆ వేడిన మరింతగా పెంచింది.

click me!