'యాత్ర' ఆడియో కు ఛీఫ్ గెస్ట్ ఎవరు?

By Udayavani DhuliFirst Published Dec 24, 2018, 1:25 PM IST
Highlights

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ 'యాత్ర' సినిమా సిద్దమవుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన 'ప్రజాప్రస్థానం' పాదయాత్ర ప్రస్తావనగా ఈ సినిమా రూపొందుతోంది. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ 'యాత్ర' సినిమా సిద్దమవుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన 'ప్రజాప్రస్థానం' పాదయాత్ర ప్రస్తావనగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టీ నటిస్తున్న విషయమూ తెలిసిందే. ఈ సినిమాను మహిరాఘవ డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం టీజర్ ని రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేఫద్యంలో ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ని గ్రాండ్ గా చేయాలని భావిస్తున్నారు. 

ఈ మేరకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. అయితే  ఈ ఆడియో పంక్షన్ కు గెస్ట్ గా ఎవరిని పిలవబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.  వైయస్ జగన్ వచ్చి ఈ ఆడియో ఈవెంట్ లో పాల్గొని ట్రైలర్ లాంచ్ చేస్తే బాగుంటుందని సినిమా నిర్మాతలు, దర్శకుడు భావిస్తున్నారట.  అయితే వైయస్ జగన్ ఈ ప్రపోజల్ ని ఏక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. వైయస్ జగన్ వస్తే కనుక..ఆయనే ఫండింగ్ చేసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినట్లు టాక్ బయిలుదేరుతుందని అది పార్టీకు ఇబ్బంది కలిగించే అంశం అవుతుందని భావిస్తున్నారట. 

ఇక ఇప్పటికే ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ‘పాదయాత్ర’ ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' సినిమా టీజర్ ను వీక్షించారు. రోడ్డుపై నడుస్తూనే హెడ్ ఫోన్స్ పెట్టుకుని యాత్ర టీజర్ ను ట్యాబ్ ద్వారా వీక్షించారు.

యాత్ర సినిమాలో వైఎస్ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా, యాత్ర సినిమా టీజర్ ను జగన్ వీక్షిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.  

click me!