యంగ్ హీరో, ఆరుగురు హీరోయిన్లకు కోర్టు షాక్.. ఆగిపోయిన '7' రిలీజ్!

By tirumala ANFirst Published Jun 4, 2019, 8:51 PM IST
Highlights

యంగ్ హీరో హవీష్ నటించిన తాజా చిత్రం సెవెన్. క్రైం థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి నజర్ షఫీ దర్శకుడు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఉత్కంఠని పెంచాయి. 

యంగ్ హీరో హవీష్ నటించిన తాజా చిత్రం సెవెన్. క్రైం థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి నజర్ షఫీ దర్శకుడు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఉత్కంఠని పెంచాయి. ఈ చిత్రంలో హీరో హవీష్ తో కలసి ఆరుగురు హీరోయిన్లు నటించారు. ఈ చిత్రంలో రొమాన్స్ కు కూడా పెద్దపీటే వేశారు. హవీష్ అందరి హీరోయిన్లతో ఈ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాడు. 

విడుదలకు ముందే మంచి బజ్ సొంతం చేసుకున్న 7 చిత్రం జూన్ 6న విడుదలకు అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. కానీ ఊహించని విధంగా ఈ చిత్రానికి షాక్ తగిలింది. 7 మూవీ రిలీజ్ పై స్టే విధిస్తూ హైదరాబాద్ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ నిర్మాత. రమేష్ వర్మకు, ఎన్నారై కిరణ్ కు మధ్య తలెత్తిన వివాదంతో ఈ చిత్ర విడుదల ఆగిపోయింది. 

సెవెన్ చిత్ర నిర్మాణంలో తనకు భాగస్వామ్యం ఇస్తానని రమేష్ వర్మ తనవద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు కిరణ్ ఆరోపించారు. కానీ సినిమా రిలీజ్ దగ్గరుతున్నా నిర్మాణంలో భాగస్వామ్యం ఇవ్వలేదని, తన దగ్గర తీసుకున్న డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదని కిరణ్ ఆరోపించారు. ఈ విషయంలో రమేష్ వర్మని ఎన్నోసార్లు హెచ్చరించా. ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించినా నాకు న్యాయం జరగలేదు. అందుకే కోర్టుని ఆశ్రయించినట్లు కిరణ్ తెలిపారు. 

కిరణ్ దాఖలు చేసిన పిటిషన్ తో హైదరాబాద్ సివిల్ కోర్టు సినిమాపై స్టే విధించింది. హవీష్ సరసన ఈ చిత్రంలో అనిషా ఆంబ్రోస్, రెజీనా, నందిత శ్వేతా, త్రిధా చౌదరి, పూజిత పొన్నాడ, అదితి ఆర్య హీరోయిన్లుగా నటించారు. 

click me!