ఆర్జీవీ `మర్డర్‌` సినిమా విడుదలకు లైన్ క్లీయర్‌

By Aithagoni RajuFirst Published Nov 6, 2020, 11:58 AM IST
Highlights

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకి గుడ్‌న్యూస్‌ చెప్పింది హైకోర్ట్. తన సినిమా `మర్డర్‌`పై ఉన్న స్టేని కొట్టేసింది. ప్రణయ్‌, అమృత, మారుతీరావు పేర్లని, ఫోటోలను వాడకుండా సినిమా విడుదల చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం తీర్పునిచ్చింది హైకోర్ట్. 
 

`మర్డర్‌` సినిమా విడుదలకు లైన్‌ క్లీయర్‌ అయ్యింది. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకి గుడ్‌న్యూస్‌ చెప్పింది హైకోర్ట్. తన సినిమా `మర్డర్‌`పై ఉన్న స్టేని కొట్టేసింది. ప్రణయ్‌, అమృత, మారుతీరావు పేర్లని, ఫోటోలను వాడకుండా సినిమా విడుదల చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం తీర్పునిచ్చింది హైకోర్ట్. 

 నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వర్మ `మర్డర్‌` పేరుతో సినిమాని తెరకెక్కించారు. మారుతీరావు కోణంలో, ఆయన హత్య చేయించింది తప్పు కాదనే కోణంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రణయ్‌ భార్య, మారుతీరావు కూతురుతోపాటు మరికొందరు ఈ సినిమాని నిలిపివేయాలని పిటిషన్‌ వేయగా, నల్గొండ కోర్ట్ సినిమా విడుదలై స్టే విధించింది. 

దీనిపై వర్మ టీమ్‌ నల్గొండ కోర్ట్ తీర్పుని సవాల్‌ చేస్తూ హైకోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదోపవాదనలు విన్న హైకోర్ట్ `మర్డర్‌` సినిమాపై ఉన్న స్టేని కొట్టేసింది. ప్రణయ్‌, అమృత, మారుతీరావు పేర్లని, ఫోటోలను వాడకుండా సినిమాతీసి విడుదల చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సినిమా తీసిన మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న కోర్ట్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

VERY HAPPY to inform that our good intentions of making the film MURDER has been rightly understood by the honourable COURT ..Details will be given once the order is with us ..THANKING EVERYONE 🙏🙏🙏💐💐💐 pic.twitter.com/lmdD4mOWVd

— Ram Gopal Varma (@RGVzoomin)
click me!