'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఏపీ రిలీజ్ పై హైకోర్టు విచారణ!

Published : Apr 15, 2019, 04:56 PM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఏపీ రిలీజ్ పై హైకోర్టు విచారణ!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో తప్ప అన్ని చోట్ల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో తప్ప అన్ని చోట్ల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీలో సినిమా రిలీజ్ కాకుండా హైకోర్టు స్టే ఇచ్చింది.

దీంతో చిత్రబృందం సుప్రీం కోర్టుని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల తరువాతైనా ఏపీలో సినిమా రిలీజ్ అవుతుందనుకుంటే అది కూడా జరగలేదు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తులు సినిమాను చూసి తీర్పుని సోమవారం నాటికి వాయిదా వేశారు.

ఈరోజు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సినిమా విడుదలపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సిందిగా సూచించింది. దీంతో మరోసారి సినిమా విడుదలపై క్లారిటీ రాకుండా పోయింది.

మరోపక్క ఈ సినిమా విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు మోహన్ రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.  

PREV
click me!

Recommended Stories

Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?