కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న `కేజీఎఫ్‌ 2` టీమ్.. మర్చిపోతున్న విషయాన్ని గుర్తు చేస్తూ..

Published : Feb 01, 2022, 03:49 PM IST
కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న `కేజీఎఫ్‌ 2` టీమ్.. మర్చిపోతున్న విషయాన్ని గుర్తు చేస్తూ..

సారాంశం

ఎలాంటి అప్‌డేట్లు లేకపోవడంతో ఓ రకంగా `కేజీఎఫ్‌ 2`ని అంతా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో మేలుకున్న యూనిట్‌ ఇప్పుడు దైవదర్శనాలతో, ఆధ్యాత్మిక సేవలో బిజీ అయ్యారు.

`కేజీఎఫ్‌`(KGF) సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ కన్నడ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇది కన్నడతోపాటు తెలుగు, హిందీ, తమిళం వంటి భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలై భారీ వసూళ్లని రాబట్టింది. `బాహుబలి` తరహాలోనే సెకండ్‌ పార్ట్ పై ఆసక్తినిపెంచింది. దీంతో రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉన్న ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు గతంలో చిత్ర బృందం ప్రకటించింది. 

కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. ప్రభాస్‌తో `సలార్‌` చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు చిత్రనిర్మాణ సంస్థ ఇతర సినిమాలతో బిజీగా ఉంది. కానీ హీరో యష్‌(Yash) మాత్రంఈ చిత్రం కోసమే వెయిట్‌ చేస్తున్నారు. దాదాపు రెండేళ్లు ఈ సినిమా కోసమే మరో సినిమా చేయకుండా వెయిటింగ్‌లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. `కేజీఎఫ్‌ 2` విడుదలయ్యాకనే మరో సినిమాని పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఎలాంటి అప్‌డేట్లు లేకపోవడంతో ఓ రకంగా `కేజీఎఫ్‌ 2`(KGF2)ని అంతా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో మేలుకున్న యూనిట్‌ ఇప్పుడు దైవదర్శనాలతో, ఆధ్యాత్మిక సేవలో బిజీ అయ్యారు. తాజాగా మంగళవారం `కేజీఎఫ్‌ 2` టీమ్‌ హీరోయష్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కొల్లూర్‌ శ్రీ మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతోపాటు అనెగుడ్డే శ్రీ వినాయక టెంపుల్‌ని యష్‌, ప్రశాంత్‌ నీల్‌తోపాటు ఇతర చిత్ర యూనిట్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ప్రస్తుతం ఆయా చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో యష్‌ ఇంకా `కేజీఎఫ్‌` చిత్రంలోని లుక్ లోనే గెడ్డంతో ఉండటం విశేషం. 

యష్‌ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన `కేజీఎఫ్‌ 2` చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ రూపొందించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరంగిదూర్‌ నిర్మించారు. ఇందులో సంజయ్‌ దత్‌ విలన్‌ పాత్రనిపోషిస్తుండగా, రవీనా టండన్‌, ప్రకాష్‌రాజ్‌, రావురమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నారు. తొలి భాగం 2018 డిసెంబర్‌ 21న విడుదలైన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?