నేను సురక్షితంగానే ఉన్నా.. కారు ప్రమాదంపై శర్వానంద్‌ పోస్ట్..

By Aithagoni RajuFirst Published May 28, 2023, 2:59 PM IST
Highlights

హీరో శర్వానంద్‌ ఈ రోజు మార్నింగ్‌ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దీంతో అంతా ఆందోళన చెందారు. అయితే తాజాగా ఈ ప్రమాదంపై హీరో శర్వానంద్‌ స్పందించారు. 

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కి గురయ్యింది. దీంతో అంతా ఆందోళన చెందారు. అటు టాలీవుడ్‌ సినిమా వర్గాలు, ఇటు అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు. శర్వానంద్‌కి గాయాలనే వార్త ఒక్కసారిగా కలవరానికి గురి చేసింది. మరికొన్ని రోజుల్లోనే పెళ్లి ఉండగా ఇప్పుడు ఈ ప్రమాదం జరగడంతో అంతా టెన్షన్‌కి గురయ్యారు. 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రమాద ఘటనపై హీరో శర్వానంద్‌ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా ప్రమాద ఘటన గురించి తెలిపారు. తాను సురక్షితంగానే ఉన్నానని, ప్రమాదం చాలా చిన్నదే అని, తనకు ఏం కాలేదని, ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. `ఈ ఉదయం నా కారు ప్రమాదానికి గురైందని వార్తలు. వచ్చాయి. ఇది చాలా చిన్న సంఘటన. మీ అందరిన ప్రేమ, ఆశీర్వాదాలతో నేను ఇంట్లో పూర్తిగా సురక్షతంగా, ఆరోగ్యంగా ఉన్నాను. చింతించాల్సిన పనిలేదు. నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు` అని తెలిపారు శర్వానంద్. 

ఈ ఉదయం ఫిల్మ్ నగర్‌ జంక్షన్‌ వద్ద రేంజ్‌ రోవర్‌లో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. ఎదురుగా వస్తోన్న టూ వీలర్‌ని తప్పించే క్రమంలో శర్వానంద్‌ కారు డివైడర్‌ని ఢీ కొట్టిందట. రేంజ్ రోవర్ కారు కావడంతో సేఫ్టీ ఫీచర్స్ అద్భుతంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీనితో శర్వాకి పెద్ద ప్రమాదమే తప్పింది అని అంటున్నారు. ప్రస్తుతం శర్వానంద్‌ ఇంట్లో సురక్షితంగానే ఉన్నట్టు తాను వెల్లడించారు.

ఇదిలా ఉండగా జూన్ 2, 3 తేదీల్లో శర్వానంద్ వివాహం రక్షిత రెడ్డితో జరగనుంది. జైపూర్ లో లీలా ప్యాలెస్ లో ఆల్రెడీ శర్వానంద్‌ వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శర్వానంద్, రక్షిత రెడ్డికి జనవరి ఎండింగ్‌లో హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. రక్షితారెడ్డి హైకోర్టు అడ్వాకెట్ మధుసూదన్ రెడ్డి కుమార్తె. ఇక శర్వానంద్‌.. ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది చిత్రీకరణ దశలో ఉంది. 

click me!