Bigg Boss Telugu 7: కెప్టెన్సీ కోసం చిచ్చుపెట్టిన బిగ్‌ బాస్‌.. హౌజ్‌లో బెస్ట్ బడ్డీలు వీరే!

Published : Oct 03, 2023, 11:18 PM IST
Bigg Boss Telugu 7: కెప్టెన్సీ కోసం చిచ్చుపెట్టిన బిగ్‌ బాస్‌.. హౌజ్‌లో బెస్ట్ బడ్డీలు వీరే!

సారాంశం

మంగళవారం ఎపిసోడ్‌లో హౌజ్‌లో ఉన్న పది మంది కంటెస్టెంట్‌లు జంటలుగా ఏర్పడాలని తెలిపారు బిగ్‌ బాస్‌.   రూట్‌ మార్చి హౌజ్‌ మేట్స్ మధ్య చిచ్చు పెట్టాడు. హాట్‌ హాట్‌గా మార్చేశాడు.

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ నాలుగు వారాలు పూర్తయ్యాయి. దీంతో ఐదో వారంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు బిగ్‌ బాస్‌. మొదట్నుంచి ఉల్టాపుల్టా అని చెబుతున్నట్టుగానే ఐదో వారంలో కొత్త నియమాలు తీసుకొచ్చారు. పవర్‌ అస్త్రలను వెనక్కి తీసుకున్నారు. శివాజీది ఆల్‌రెడీ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో సందీప్‌, శోభా శెట్టి, ప్రశాంత్‌లు కూడా తమ పవర్‌ అస్త్రలను వెనక్కి ఇచ్చేశారు. అయితే అందరి పవర్‌ అస్త్రాలు వెనక్కి వెళ్లడంతో శివాజీ హ్యాపీగా ఫీలయ్యాడు. తన అస్త్రలను తీసుకుంటారా? ఇప్పుడు అందరివి పోయినందుకు ఆయన హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ విషయంలో శోభా శెట్టి హర్ట్ అయ్యింది. కొందరు సంతోషిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఇక మంగళవారం ఎపిసోడ్‌లో హౌజ్‌లో ఉన్న పది మంది కంటెస్టెంట్‌లు జంటలుగా ఏర్పడాలని తెలిపారు బిగ్‌ బాస్‌. ఈ నెల రోజుల్లో హౌజ్‌లో ఒకరితో ఒకరికి బాండింగ్‌ ఏర్పడి ఉంటుందని, అలా తమ బెస్ట్ బడ్డీలను ఎంపిక చేసుకోవాలని, అందరు జంటలుగా ఏర్పడాలని తెలిపారు బిగ్‌బాస్‌. వాళ్లు బడ్డీలుగా ఏర్పడిన దాన్ని బట్టి మున్ముందు ఆట ఉంటుందని, అందుకే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ క్రమంలో హౌజ్‌ సభ్యులు ఐదు జంటలుగా ఏర్పడ్డారు. శివాజీ-ప్రశాంత్‌, అమర్‌-సందీప్‌, ప్రియాంక-శోభా శెట్టి, గౌతమ్‌-శుభ శ్రీ, యావర్‌-తేజ బడ్డీలుగా ఏర్పడ్డారు. 

అనంతరం వీరికి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచిన వారు సూపర్‌ పవర్‌ కూడా పొందుతారు. అందులో భాగంగా `స్మైల్‌` టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఆ స్మైల్‌లో పళ్లు మిస్సింగ్‌ ఉంటాయి. వాటిని వెతికి తీసుకురావాల్సి ఉంటుంది. అందుకో గేమ్‌ పెట్టాడు బిగ్‌ బాస్‌. దీనికి యావర్‌, శోభా శెట్టి సంచాలకులుగా వ్యవహరిస్తారు. అయితే మొదట శివాజీ, ప్రశాంత్‌ పళ్లు ఫిల్‌ చేసి బెల్ కొడతారు. ఆ తర్వాత గౌతమ్‌-శుభ శ్రీ, ఆ తర్వాత సందీప్‌-అమర్‌లు బెల్‌ కొడతారు. శోభా శెట్టి, ప్రియాంకలు, చివరగా యావర్‌ తేజలు నిలుస్తారు. 

కానీ అందరు సరిగ్గా టీత్‌లను అమర్చకపోవడంతో యావర్‌-శోభాశెట్టి నిర్ణయం తీసుకోలేకపోతారు. కానీ తక్కువ మిస్టేక్స్ ఆర్డర్‌ ప్రకారం గౌతమ్‌-శుభశ్రీ, సందీప్‌- అమర్‌, శివాజీ-ప్రశాంత్‌, శోభాశెట్టి-ప్రియాంక, చివరగా యావర్‌-తేజలుగా నిర్ణయించారు. కానీ దీనిపై అటు అమర్‌, ఇటు ప్రియాంక అభ్యంతరం తెలిపారు. ఇది హౌజ్‌లో పెద్దగా గందరగోళానికి దారి తీస్తుంది. హౌజ్‌మేట్స్ గొడవలకు దిగడంతో ఒక్కసారిగా హౌజ్‌ హీటెక్కిపోయింది. ఇందులో ఫైనల్‌ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం