అల్లు అర్జున్‌ని కలిసిన గవర్నర్‌.. ఏకంగా ఇంటికెళ్లి మరీ అభినందనలు..

Published : Aug 28, 2023, 05:38 PM IST
అల్లు అర్జున్‌ని కలిసిన గవర్నర్‌.. ఏకంగా ఇంటికెళ్లి మరీ అభినందనలు..

సారాంశం

అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఏకంగా ఆయన్నింటికెళ్లి సత్కరించడం విశేషం.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇటీవల జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. తెలుగు నటుల నుంచి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డుకి ఎంపికైన తొలి నటుడిగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, మోహన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వరకు ఎవరీ సాధ్యం కానిది బన్నీకి సాధ్యమైంది. నేషనల్‌ అవార్డుకి ఎంపికైన సందర్భంగా బన్నీకి విశేష ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా సత్కారాలను అందుకుంటున్నారు బన్నీ. తాజాగా ఆయన్ని ఏకంగా గవర్నర్‌ కలవడం విశేషం. 

హరియానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ బన్నీని కలిశారు. సోమవారం ఏకంగా అల్లు అర్జున్‌ ఇంటికెళ్లి మరీ ఆయన్ని ప్రత్యేకంగా అభినందించడం విశేషం. అల్లు అర్జున్‌కి నేషనల్‌ అవార్డు వచ్చిన సందర్భంగా బండారు దత్తాత్రేయ ఆయన్ని శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా కాసేపు బన్నీతో ముచ్చటించారు గవర్నర్‌ దత్తాత్రేయ. ఇందులో టాలీవుడ్‌ సినిమా పరిశ్రమ ఎదుగుదల గురించి బన్నీ గవర్నర్‌కి వివరించారట. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

`పుష్ప` చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్‌. ఈ సినిమాకి మ్యూజిక్‌ విభాగంలోనూ దేవిశ్రీ ప్రసాద్‌కి నేషనల్‌ అవార్డు వరించిన విషయం తెలిసిందే. సుకుమార్‌ రూపొందించిన `పుష్ప`లో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా నటించారు. ఇందులో పూర్తి డీ గ్లామర్‌గా, ఊరమాస్‌ రోల్‌ చేశాడు బన్నీ. ఇక సినిమాలో తనకు జోడీగా రష్మిక మందన్నా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించారు. 2021 డిసెంబర్లో  ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో సమంత చేసిన ఐటెమ్‌ సాంగ్‌ ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన రెండో పార్ట్ లో బన్నీ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నేషనల్‌ అవార్డు వచ్చిన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా