అఫీషియల్‌ః `గేమ్‌ ఛేంజర్‌` పాట వాయిదా ప్రకటన.. కారణం వేరే ఉందిగా!

రామ్‌చరణ్‌ నటిస్తున్న` గేమ్‌ ఛేంజర్‌` సినిమా నుంచి తొలి పాట `జరగండి`ని దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా దాన్ని వాయిదా వేస్తూ టీమ్‌ అఫీషియల్‌ నోట్ ని పంచుకుంది.

Google News Follow Us

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` నుంచి పాట వస్తుందని, గత వారం రోజులుగా ఉదరగొట్టారు. దీపావళి అకేషన్‌ కూడా ఫిక్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో వెయిట్‌ చేస్తున్నారు. అంతలోనే పాట్‌ విజువల్స్ లీక్‌ కావడం పెద్ద ఎఫెక్ట్ అయ్యింది. దీనికితోడు పాట వాయిదా అంటూ గత రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. నిర్మాణ సంస్థ ఓ నోట్‌ని సోషల్‌ మీడియాలో పంచుకుంది. 

రూమర్లని నిజం చేస్తూ `జరగండి` అంటూ సాగే పాట విడుదల వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అందుకు కారణం చెబుతూ, ఆడియో డాక్యుమెంటేషన్‌లో నెలకొన్న సమస్యల కారణంగా పాటని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఆడియో డాక్యుమెంటేషన్‌లో విభిన్న రకాల సమస్యలు వచ్చాయని, దీంతో `గేమ్‌ ఛేంజర్‌` నుంచి `జరగండి` పాటని వాయిదా వేస్తున్నామని తెలిపారు. 

మళ్లీ ఎప్పుడు రిలీజ్‌ చేస్తామనేది త్వరలోనే వెల్లడిస్తామని, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శకుడు శంకర్‌ ఫ్యాన్స్ వెయిటింగ్‌కి తగ్గ వర్త్ తో పాట ఉంటుందని, `గేమ్‌ ఛేంజర్‌`కి సంబంధించి ప్రతిదీ ది బెస్ట్ ఉంటుంది, క్వాలిటీతో కూడిన వినోదాన్ని అందించేందుకు టీమ్‌ అవిశ్రాంతంగా వర్క్ చేస్తుందని చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

అయితే `జరగండి` పాట వాయిదా వేయడానికి ఇప్పట్నుంచి ప్రమోషన్స్ వద్దనుకుని వాయిదా వేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. అలాగే సింగర్‌ని మారుస్తున్నారని, మొదట అనుకున్న సింగర్ పాడిన సాంగ్ అంతగా రాలేదని, దీంతో సింగర్‌ని మారుస్తున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ దానికి భిన్నంగా టీమ్‌ కారణం చెప్పడం గమనార్హం. ఏదేమైనా దీపావళి పండగ రోజు పాటతో పండగ చేసుకోవాలనుకున్న చరణ్‌ఫ్యాన్స్ కిది డిజప్పాయింట్‌ వార్తే అని చెప్పొచ్చు. 

ఇక రామ్‌చరణ్‌ హీరోగా, శంకర్‌ రూపొందిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!