కరోనాపై గెలిచిన రాజమౌళి.. మూడు వారాల్లో ప్లాస్మా ఇస్తారట!

Published : Aug 12, 2020, 05:58 PM IST
కరోనాపై గెలిచిన రాజమౌళి.. మూడు వారాల్లో ప్లాస్మా ఇస్తారట!

సారాంశం

రాజమౌళి కరోనాని గెలిచారు. రెండు వారాల క్వారంటైన్‌ అనంతరం ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులను నెగటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` అభిమానులు ఊరిపి పీల్చుకున్నారు.   

దర్శకధీరుడు రాజమౌళి కరోనాని జయించాడు. మొత్తానికి వైరస్‌ పై విజయం సాధించాడు. రెండు వారాల క్వారంటైన్‌ అనంతరం ఆయనకు కరోనా నెగటివ్‌ వచ్చింది. ఆయనకే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా నెగటివ్‌ వచ్చినట్టు నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. 

`రెండు వారాల క్వారంటైన్‌ పూర్తయ్యింది. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. టెస్ట్ చేయించుకుంటే మా అందరికి నెగటివ్‌ అని తేలింది. ప్లాస్మా దానం చేసేందుకు తగినన్ని ఆంటీ బాడీస్‌ అభివృద్ధి చెందుతున్నాయో లేదో చూసేందుకు మూడు వారాల టైమ్‌ పడుతుందని డాక్టర్‌ చెప్పారు. ఆ తర్వాత ప్లాస్మా డొనేట్‌ చేస్తాం` అని తెలిపారు. 

రాజమౌళి ఈ ప్రకటనతో ఇప్పుదంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌ రిలాక్స్ అయ్యింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాస్త కుదుట పడ్డారు. ఇక `ఆర్‌ ఆర్‌ ఆర్‌` అభిమానులు ప్రపంచాన్ని జయించినంతగా ఫీల్‌ అవుతున్నారు. ఇదిలా ఉంటే గత వారం `ఆర్‌ ఆర్‌ ఆర్‌` నిర్మాత డివివి దానయ్యకి సైతం కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు. 

రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`  సినిమా రూపొందుతుంది. భారీ బడ్జెట్‌తో, మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. ఇక రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా, బాలీవుడ్‌ నటి అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలీవియా మోర్రిస్‌ హీరోయిన్లుగా.. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రధారులుగా పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి