Prabhas-Salaar: సలార్ కోసం ప్రశాంత్ నీల్ కండీషన్స్... ప్రభాస్ కి ఎంత కష్టమొచ్చిందో! 

By Sambi ReddyFirst Published May 19, 2022, 12:44 PM IST
Highlights

బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మునుపటి చార్మ్, గ్లామర్ కోల్పోయాడన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ప్రభాస్ పరాజయాల వెనుక ఆయన లుక్ కూడా ఒక కారణమనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ నిర్ణయం తీసుకున్నాడన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. 
 

లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ కి ఫుల్ ఫాలోయింగ్. టాలీవుడ్ లో మహేష్ తర్వాత ఈ ఇమేజ్ తెచ్చుకున్న హీరో ప్రభాస్ (Prabhas). డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు ఆయనకు లేడీస్ ఫాలోయింగ్ విపరీతంగా తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాల్లో ప్రభాస్ చాలా హ్యాండ్ సమ్ గా ఉంటారు. మిర్చి అనంతరం విడుదలైన బాహుబలి సిరీస్లో కూడా ప్రభాస్ పాత్రకు తగ్గట్టు మంచి లుక్ లో ఆకట్టుకున్నారు. సాహో విషయానికి వచ్చేసరికి ప్రభాస్ లుక్ పూర్తిగా మారిపోయింది. సిక్స్ ప్యాక్ బాడీతో స్లిమ్ గా ఉన్నప్పటికీ ఫేస్ లో గ్లో కనిపించలేదు. ఆయన కళ్ళలో కాంతి పోయి నిర్జీవంగా తయారయ్యాయి. 

రాధే శ్యామ్ (Radhe Shyam) మూవీలో కూడా ప్రభాస్ ఏమంత అందంగా కనిపించలేదు. దానికి తోడు ప్రభాస్ మరలా బరుపు పెరిగాడు. సలార్ పాత్ర రీత్యా ప్రభాస్ ని స్లిమ్  అండ్ ఫిట్ గా ఉండాలని ప్రశాంత్ నీల్ కోరుకుంటున్నాడట. దీని కోసం జిమ్ లో కష్టపడి బరువు తగ్గాలని ప్రభాస్ కి సూచించారట. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కోరిక మేరకు ప్రభాస్ జిమ్ లో కష్టపడుతున్నారట. సలార్ మూవీతో ప్రభాస్ విమర్శకుల నోళ్లు మూయించాలని అనుకుంటున్నారట. మరి చూడాలి ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దే ప్రభాస్ ఎలా ఉంటారో. 

సలార్ (Salaar) 30-35 శాతం షూటింగ్ పూర్తి కాగా నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్ధమవుతున్నారు. ప్రభాస్ పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారు. దీని కోసం ఓ సెట్ సిద్ధం చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ తో డైరెక్టర్ చర్చలు జరుపుతున్నారు. బాహుబలి తర్వాత వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న ప్రభాస్ కి సలార్ పర్ఫెక్ట్ కం బ్యాక్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఇటీవల ఓ అభిమాని సలార్ అప్డేట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసిన విషయం తెలిసిందే. 2023 సమ్మర్ కానుకగా మూవీ విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. కాబట్టి సలార్ థియేటర్స్ లో దిగడానికి మరో ఏడాది సమయం ఎదురుచూడాల్సిందే. కెజిఎఫ్ నిర్మాతలైన హోమబుల్ ఫిలిమ్స్ సలార్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు.

click me!