అఖిల్ కోసం రంగంలోకి క్రిష్..?

By Udayavani DhuliFirst Published Feb 1, 2019, 11:26 AM IST
Highlights

'మిస్టర్ మజ్ను' చిత్రంతో అఖిల్ సక్సెస్ అందుకుంటాడని అక్కినేని కాంపౌండ్ ఆశగా ఎదురుచూసింది. కానీ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

'మిస్టర్ మజ్ను' చిత్రంతో అఖిల్ సక్సెస్ అందుకుంటాడని అక్కినేని కాంపౌండ్ ఆశగా ఎదురుచూసింది. కానీ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో నాగార్జున ఆలోచనలో పడ్డాడు.

తన కుమారుడుకి సక్సెస్ ఇచ్చే దర్శకుడి కోసం వేట మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శ్రీనువైట్ల, పూరి జగన్నాథ్ వంటి దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ నాగార్జున మాత్రం దర్శకుడు క్రిష్ ని లాక్ చేసినట్లు సమాచారం. దర్శకుడిగా క్రిష్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

తన సినిమాల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ కారణంగానే క్రిష్ తో అఖిల్ సినిమా చేస్తే బాగుంటుందని నాగార్జున అనుకుంటున్నాడు. క్రిష్ దగ్గర కూడా కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ప్రస్తుతం క్రిష్.. ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా విడుదలైన తరువాత అఖిల్ తో సెట్స్ పైకి వెళ్తాడని చెబుతున్నారు. మరి క్రిష్ అయినా అఖిల్ కి సక్సెస్ ఇస్తాడేమో చూడాలి!
 

click me!