వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.! ఎప్పుడు స్టార్ట్ కాబోతుందంటే?

By team teluguFirst Published Jul 4, 2022, 5:06 PM IST
Highlights

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇకపై వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా వెబ్ సిరీస్ లకు రైటర్ గా వర్క్ చేసిన ఈయన.. డైరెక్షన్ కూడా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
 

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) ‘గమ్యం’ సినిమాతో టాలీవుడ్ దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈ తీసిన సినిమాల్లో కథాంశం చాలా బలంగా ఉంటుంది. ఆయన సినిమాలకు ఎక్కువ శాతం క్రిష్ నే కథలు రాసుకుంటాడు. అందుకే వచ్చే అవుట్ పుట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ‘క్రిష్ణం వందే జగద్గురుమ్’,‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తన మార్క్ చూపించాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో  ఓ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నాడు.

క్రిష్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి గతంలోనే ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్ర షూటింగ్ ను క్రిష్ శరవేగంగా కొనసాగిస్తున్నారు. 17వ దశాబ్దపు కాలంలో మొగుల్ ఎంపైర్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్ తన మేక్ ఓవర్ ను పూర్తిగా మార్చేశాడు. హీరోయిన్ నిధి అగర్వాల్ పవన్ సరసన ఆడిపాడనుంది. ఇదిలా ఉంటే.. క్రిష్ సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లపైనా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే మున్ముందు మాత్రం తానే స్వయంగా డైరెక్ట్ చేయనున్నట్టు నెట్టింట గట్టిగానే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే క్రిష్ రెండు వెబ్ సిరీస్ లు ‘మస్తీ స్’,‘9 అవర్స్’ వెబ్ సిరీస్ లకు రైటర్ గా వర్క్ చేశారు. ఇటీవల సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ గా 9 Hours వెబ్ సిరీస్ టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆడియెన్స్ నుంచి ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే వెబ్ సిరీస్ లకు కూడా మంచి ప్రేక్షకాదరణ ఉండటంతో క్రిష్ ఇకపై ఓ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.

తాజాగా సమాచారం ప్రకారం.. క్రిష్ డైరెక్ట్ చేయబోయే వెబ్ సిరీస్ సామాజిక అంశంపైనే ఉండనున్నట్టు తెలుస్తోంది. ఓ వేశ్య జీవితం ఆధారంగా ఈ సిరీస్ కొనసాగుతోందని గట్టి టాక్. ఇప్పటికే అల్లు అర్జున్, అనుష్క శెట్టి నటించిన ‘వేదం’ చిత్రంలో ఈ అంశాన్ని చూపించారు క్రిష్. ఇప్పుడు పూర్తి స్థాయిలో సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ ఓటీటీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్.. ఈ చిత్రం పూర్తయ్యాక వెబ్ సిరీస్ ను స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.

 

click me!