దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘డి - కంపెనీ’. అష్వత్ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 15న స్పార్క్ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలోని 4 నిమిషాల సీన్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆర్జీవీ.
మా వస్తువు ఇలా ఉంటుంది అని టేస్ట్ చూపించి కొనుక్కోమనటం సాధారణంగా వ్యాపారస్దులు చేస్తూంటారు. సినిమా కూడా వ్యాపారం అయ్యిపోయిన నేపధ్యంలో మా సినిమాలో మొదటి పది నిముషాలు చూడండి..నచ్చితే మిగతాది చూడండి అంటూ ప్రచారం చేయటం మొదలైంది. ఆ మధ్యన విజయ్ ఆంటోని తన భేతాళుడు చిత్రం ప్రమోషన్ కోసం చేస్తే..రీసెంట్ గా మోసగాళ్లు ప్రమోషన్ కోసం మంచు విష్ణు అదే పంధాలో వెళ్లాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సైతం అదే పనిచేస్తున్నారు.
దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘డి - కంపెనీ’. అష్వత్ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 15న స్పార్క్ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలోని 4 నిమిషాల సీన్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆర్జీవీ.
ఇప్పుడు ముంబయి చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అప్పుడు 40 సంవత్సరాల క్రితం డీ కంపెనీ కంట్రోల్ ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు అని ఆర్జీవీ చెప్పిన మాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్ లీడర్.. పెద్ద గ్యాంగ్స్టర్గా ఎలా ఎదిగాడో ఈ చిత్రంలో చూపించనున్నారు. దావూద్ చరిత్ర ఏంటో మీరూ చూసి తెలుసుకోండి... అంటూ వీడియోని వదిలారు.
ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్ లీడర్.. పెద్ద గ్యాంగ్స్టర్గా ఎలా ఎదిగాడన్నది ఇందులో చూపించనున్నారు దర్శకుడు. అలాగే అతను స్థాపించిన డి-కంపెనీ నీడలో బతికిన ఇతర గ్యాంగ్స్టర్ల జీవితాల్ని ఈ చిత్రంలో స్పృశించారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఓ చిత్రం తెరకెక్కించారు. అష్వత్ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు.