
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ వద్ద చేసిన యాక్సిడెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సురేష్ బాబు కారు రాంగ్ రూట్ లో వచ్చి బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొట్టింది.
దీంతో బైక్ మీద ప్రయాణిస్తోన్న సతీష్ చంద్ర(35), నీలం దుర్గాదేవి(30), నీలం సిద్దేశ్ చంద్ర(3) లకి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన సురేష్ బాబుకి కార్ఖానా పోలీసులు 41A సెక్షన్ కింద నోటీసులు పంపించారు.
కారు నడిపింది సురేష్ బాబేనని కార్ఖానా సీఐ తెలిపారు. ప్రమాదం తరువాత ఆయన పోలీస్ స్టేషన్ కి కారుతో వచ్చినట్లు సీఐ స్పష్టం చేశారు. సురేష్ బాబుకి నోటీసులు జారీ చేశామని, ఆయనపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
సంబంధిత వార్త..
యాక్సిడెంట్ చేసిన దగ్గుబాటి సురేష్ బాబు!