మహేష్ కి విలన్ గా బాలీవుడ్ హీరో..?

By Satish ReddyFirst Published Sep 6, 2020, 3:34 PM IST
Highlights

మహేష్ నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాటపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. మహేష్ ని దర్శకుడు సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నాడని తెలుస్తుండగా ఈ మూవీలో విలన్ పాత్ర చేయనున్న నటుడి గురించి క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. 


వరుస హిట్స్ తో జోరుమీదున్న మహేష్ నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట పై భారీ అంచనాలున్నాయి. ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన, దర్శకుడు పరుశురామ్ తో సర్కారు వారి పాట అనే క్రేజీ మూవీ ప్రకటించారు. ఈ మూవీలో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నారన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఒక పాత్రలో సాఫ్ట్ ఫెలోగా, మరో పాత్రలో కన్నింగ్ ఫెలోగా మహేష్ ఉంటాడని సదరు కథనాల సారాంశం. కాగా సర్కారు వారి పాట చిత్రంలో విలన్ రోల్ చాలా కీలకం అని తెలుస్తుంది. 

ఈ పాత్ర కోసం ఇప్పటికే అనేక మంది నటులు పేర్లు తెరపైకి వచ్చాయి. తమిళ పరిశ్రమ నుండి అరవింద స్వామి, కన్నడ నుండి ఉపేంద్ర, సుదీప్ పేర్లు వినిపించాయి. తాజాగా సర్కారు వారి పాట మూవీలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ని తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు పరుశురాం అనిల్ కపూర్ కి  స్క్రిప్ట్ కూడా వివరించగా, ఆయన ఈ పాత్ర చేయడానికి ఆసక్తి చూపించారని వినికిడి. 

మరి ఇదే కనుక నిజం అయితే మూవీకి మరింత హైప్  వచ్చి చేరుతుంది. అనిల్ ఇంత వరకు సౌత్ సినిమాలలో విలన్ పాత్ర చేసింది లేదు. ఇక సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ కి మహేష్ సిద్ధం అవుతున్నారు. సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ దర్శకుడు అమెరికాలో ప్లాన్ చేశారట.  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

click me!