రేపిస్ట్ రాజు మృతిపై చిరంజీవి ట్వీట్‌.. పౌరసమాజం చొరవ చూపాలంటూ..

Published : Sep 16, 2021, 04:49 PM IST
రేపిస్ట్ రాజు మృతిపై చిరంజీవి ట్వీట్‌.. పౌరసమాజం చొరవ చూపాలంటూ..

సారాంశం

సడెన్‌గా రేపిస్ట్ రాజు మృతదేహం గురువారం ఘన్‌పూర్‌ నక్కల్‌ రైల్వే ట్రాక్‌పై మృతదేహం ప్రత్యక్షమవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రకటించారు. మరోవైపు పోలీసులు చంపి పడేశారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. 

సైదాబాద్‌ చిన్నారి ఘటనపై యావత్‌ రాష్ట్రాన్ని కదిలిస్తుంది. వారం రోజులపాటు నిందితుడు రాజుని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సడెన్‌గా రేపిస్ట్ రాజు మృతదేహం గురువారం ఘన్‌పూర్‌ నక్కల్‌ రైల్వే ట్రాక్‌పై మృతదేహం ప్రత్యక్షమవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రకటించారు. మరోవైపు పోలీసులు చంపి పడేశారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. 

తాజాగా చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఇలాంటి ఘటనలపై పౌర సమాజం బాధ్యతగా స్పందించాలన్నారు. `అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌరసమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతోపాటు పౌర సమాజం చొరవ చూపాలి. 

అలాంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి` అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. అయితే ఈ ఘటనపై ఇప్పుడు అనేక అనుమానాలు, అనేక వాదనలు తెరపైకి రావడం విచారకరం. దీనిపై మంచు మనోజ్‌ కూడా స్పందించిన విషయం తెలిసిందే. రాజు మృతి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవి, ఏఎన్నార్ భయపడేది ఆ హీరోయిన్ కి మాత్రమే.. ఎంత చనువుగా ఉన్నా వణికిపోవాల్సిందే
థాంక్యూ మై దోస్త్.. మహేష్ బాబు కు ప్రియాంక చోప్రా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకో తెలుసా?