గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్... ఆచార్య కంటే మరీ అంత తక్కువా!

By Sambi ReddyFirst Published Oct 3, 2022, 3:23 PM IST
Highlights


గాడ్ ఫాదర్ మూవీ విడుదలకు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటికి వస్తున్నాయి. కాగా చిరంజీవి గత చిత్రం ఆచార్య కంటే చాలా తక్కువ రేటుకు గాడ్ ఫాదర్ అమ్ముడుపోయింది. 
 


గాడ్ ఫాదర్ పై ఆచార్య ఎఫెక్ట్ బాగానే పడింది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ఒకింత భయపడ్డారు. అడిగిన రేటు ఇచ్చి దక్కించుకునే ప్రయత్నం చేయలేదు. తక్కువ ధరలకు బేరమాడారు. ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ లో మూడొంతులు బిజినెస్ మాత్రమే గాడ్ ఫాదర్ చేసింది. ఏపీ/తెలంగాణా కలిపి గాడ్ ఫాదర్ రూ. 64.6 కోట్లకు అమ్ముడుపోయింది. నైజాం హక్కులు రూ. 22 కోట్లు పలుకగా, సీడెడ్ రూ. 12.6 కోట్లు పలికాయి. ఇక ఆంధ్రా హక్కులు రూ.30 కోట్లకు  బయ్యర్లు దక్కించుకున్నారు. 

వరల్డ్ వైడ్ గాడ్ ఫాదర్ రూ. 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నప్పటికీ గాడ్ ఫాదర్ బిజినెస్ వంద కోట్లు దాటలేదు. అదే సమయంలో ఆచార్య రూ. 131 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. కొరటాల శివ దర్శకుడు కావడం, రామ్ చరణ్- చిరంజీవి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ కావడంతో ఆ రేంజ్ బిజినెస్ చేసింది. ఇక చిరంజీవి కెరీర్ లో సైరా నరసింహారెడ్డి అత్యధికంగా రూ.187.25 కోట్ల బిజినెస్ చేసింది. కాగా చిరంజీవి కమ్ బ్యాక్ చిత్రం ఖైదీ 150 రూ.89 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. 

దర్శకుడు మోహన్ రాజా పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కించారు. ఇది మలయాళ హిట్ మూవీ లూసిఫర్ అధికారిక రీమేక్. సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ చేయడం విశేషం. లేడీ సూపర్ స్టార్ నయనతార మరో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ విడుదల కానుంది. గాడ్ ఫాదర్ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 
 

click me!