Chiranjeevi Tweet on Ticket Rates: పరిశ్రమకి, థియేటర్లకి మేలు చేసే నిర్ణయం.. ఏపీ టికెట్ రేట్ల జీవోపై చిరు

Published : Mar 07, 2022, 09:27 PM ISTUpdated : Mar 07, 2022, 09:30 PM IST
Chiranjeevi Tweet on Ticket Rates: పరిశ్రమకి, థియేటర్లకి మేలు చేసే నిర్ణయం.. ఏపీ టికెట్ రేట్ల జీవోపై చిరు

సారాంశం

ఏపీలో టికెట్‌ రేట్లని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా ఓ నోట్‌ని షేర్‌ చేశారు.

దాదాపు ఏడాది పాటుగా టాలీవుడ్‌(Tollywood) చిత్ర పరిశ్రమ పడుతున్న ఇబ్బంది నుంచి బిగ్‌ రిలీఫ్‌ దొరికింది. టికెట్‌రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కొత్త జీవో(AP Government GO) తీసుకొచ్చి నిర్మాతలకు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకి గుడ్‌న్యూస్‌ చెప్పింది. టికెట్‌ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడమేకాదు, జీవోని సోమవారం సాయంత్రం విడుదల చేసింది. థియేటర్లని ప్రధానంగా నాలుగు విభాగాలుగా విభజించి ఒక్కో థియేటర్లో సీట్లని రెండు రకాలుగా విడగొట్టి టికెట్‌రేట్లని ఖరారు చేసింది. పెంచిన టికెట్‌ రేట్లు నిర్మాతలు, ఎగ్జిబిటర్లకి ప్రయోజనకరంగానే ఉండటం విశేషం. 

ఇదిలా ఉంటే దీనిపై మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) స్పందించారు. ఏపీ సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలిపారు. `తెలుగు సినిమా పరిశ్రమకి మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్‌ రేట్లు సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌జగన్‌గారికి పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు. చిన్న సినిమాకి ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రివర్యులు పేర్నినానికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు` అని పేర్కొన్నారు.

ఏపీలో టికెట్‌ రేట్లు తగ్గించడంతో పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు విమర్శిస్తూ కామెంట్లు చేశారు. దీంతో వివాదం మరింతగా ముదిరింది. ఆ తర్వాత ఓ సారి చిరంజీవి స్వయంగా వెళ్లి సీఎం జగన్‌ని కలిశాడు. నాగార్జున కూడా కలిశారు. కానీ దీనిపై ఎలాంటి స్పందన లేదు. దీంతో  దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రంగంలోకి దిగారు. ఆయన వరుస ట్వీట్లతో ఏపీ ప్రభుత్వానికి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానికి చుక్కలు చూపించారు. అంతేకాదు ఏకంగా మంత్రి పేర్నినానితో చర్చలు జరిపారు. కానీ సమస్య కొలిక్కి రాలేదు. 

దీంతో సీఎం జగన్‌ ఆహ్వానం మేరకు చిరంజీవి రంగంలోకి దిగారు. ఆయన పలు వేదికల్లో సీఎంని రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన సీఎంని కలిసి సమస్యలను వివరించారు. త్వరలోనే మంచి నిర్ణయాలు వస్తాయని, అందరికి సానుకూల నిర్ణయం వస్తుందని తెలిపారు.  ప్రభాస్‌, మహేష్‌,రాజమౌళి, కొరటాల శివ, ఆర్‌ నారాయణమూర్తి, అలీ, పోసానిలతో కలిసి చిరంజీవి సీఎం జగన్‌ని కలిసి సమస్యని వివరించారు. జగన్ త్వరలోనే సమస్యని పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. దాదాపు 25రోజుల గ్యాప్‌తో జీవోని విడుదల చేసిన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌