ఓకే వేదికపైకి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌.. అరుదైన కలయికకి రంగం సిద్ధం?.. ఫ్యాన్స్ కి ట్రీట్‌

Published : Dec 26, 2023, 04:07 PM ISTUpdated : Dec 26, 2023, 04:12 PM IST
ఓకే వేదికపైకి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌.. అరుదైన కలయికకి రంగం సిద్ధం?.. ఫ్యాన్స్ కి ట్రీట్‌

సారాంశం

టాలీవుడ్‌ టాప్ హీరోలు ఒక్క వేదికపైకి రాబోతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నటసింహాం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు. 

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో అరుదైన సన్నివేశం చూడబోతున్నాం. టాప్‌ హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకునే సందర్భం రాబోతుంది. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు అనేంతటి దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. టాలీవుడ్‌ టాప్ హీరోలు ఒక్క వేదికపైకి రాబోతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నటసింహాం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు. ఈ అరుదైన కలయికకి వెంకటేష్‌ కారణం కాబోతున్నారు. ఆయన సినిమా కారణం కాబోతుందట. 

విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం `సైంధవ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్‌కి మైలు రాయిలాంటి మూవీ. ఆయన నటిస్తున్న 75వ చిత్రం కావడం విశేషం. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. రేపు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. `కళియుగ పాండవులు` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్‌. మరో హీరో హ్యాండివ్వడంతో తండ్రి, నిర్మాత రామానాయుడు.. వెంకీని విదేశాల నుంచి పిలిపించాడు. నువ్వే హీరో అని ప్రకటించాడు. అప్పటికప్పుడు యాక్టింగ్‌ నేర్పించి ఆ సినిమా చేయించాడు. 

అలా అనుకోకుండా హీరో అయిన వెంకీ ఇప్పుడు 75వ సినిమా మైలు రాయికి చేరుకున్నాడు. దీంతో ఈ అరుదైన సందర్భాన్ని పెద్దగా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటున్నాడు వెంకీ. ఇండస్ట్రీ పెద్దలతో కలిసి సెలబ్రేట్‌ చేయాలని భావించడట. తన సమకాలీకులు, స్నేహితులు చిరంజీవి, నాగార్జున, బాలయ్యలను `సైంధవ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి, తన 75వ మూవీకి సంబంధించిన ప్రత్యేక ఈవెంట్‌కి ఆహ్వానించినట్టు సమాచారం. రేపు(డిసెంబర్‌ 27న) బుధవారం జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక జరగబోతుంది. మరి ఈ చిరు, బాలయ్య, నాగ్‌ ఈ ఈవెంట్‌లో కలుస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.ఈ వార్త టాలీవుడ్‌లో అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తుంది. నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇక వెంకటేష్‌ నటించిన `సైంధవ్‌` మూవీకి `హిట్‌` చిత్రాల ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తుండగా, శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తుంది. ఆర్య, ఆండ్రియా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ రిలీజ్‌ కాబోతుంది. త్వరలోనే ట్రైలర్‌ రానుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రెండో భార్యతో కూడా దర్శకుడు విడాకులు ? మొన్న తమ్ముడు, ఇప్పుడు అన్న.. ఫోటోలు డిలీట్ చేసిన భార్య
Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ..