చిన్నారి పెళ్లికూతురు సీరియల్ నటి మృతి!

By team teluguFirst Published Jul 16, 2021, 10:53 AM IST
Highlights

నటిగా ఎన్నో మైలురాళ్లు అందుకున్న సురేఖ మరణం బాలీవుడ్ ని తీవ్ర విషాదంలో నింపివేసింది. కొద్దిరోజుల క్రితం సురేఖ బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు.

నేషనల్ అవార్డు విన్నింగ్ నటి సురేఖ సిక్రి నేడు ఉదయం కన్నుమూశారు. 75ఏళ్ల సురేఖ గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది. నటిగా ఎన్నో మైలురాళ్లు అందుకున్న సురేఖ మరణం బాలీవుడ్ ని తీవ్ర విషాదంలో నింపివేసింది. కొద్దిరోజుల క్రితం సురేఖ బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు. షూటింగ్ కోసం మహాబలేశ్వరం వెళ్లగా, బాత్రూమ్ లో ఆమె క్రిందపడిపోయారు. ఆ సమయంలో ఆమె తలకు గాయమైంది. చికిత్స అనంతరం కోలుకున్నట్లు సురేఖ తెలియజేశారు. 


బాలిక వధు సీరియల్  ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో చిన్నారి పెళ్లికూతురుగా ప్రసారమైన ఈ సీరియల్ అత్యంత ఆదరణ రాబట్టింది. అలా సురేఖ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయ్యారు. 


ఇక కెరీర్ లో మూడు సార్లు ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డ్స్ అందుకుంది సురేఖ. బాలీవుడ్ లో ఆమె పలు చిత్రాల్లో నటించారు. చేసింది చిన్న పాత్రలే అయినా, ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. ప్రముఖ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆమె గ్రాడ్యుయేషన్ చేశారు. మూడు దశాబ్దాలుగా నటనలో రాణిస్తున్నారు. జుబేదా, మిస్టర్ అండ్ మిసెస్,  ఐయ్యర్ అండ్ రైన్ కోట్ వంటి చిత్రాలలో ఆమె నటనకు ప్రసంశలు దక్కాయి. 
 

click me!