ఛీటింగ్ కేసులో యువ హీరో... వ్యాపారికి రూ. 12లక్షల టోకరా!

By team teluguFirst Published Jan 20, 2021, 8:48 AM IST
Highlights

శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రెడ్డి రామ కృష్ణ అనే వ్యాపారికి తక్కువ ధరకే లగ్జరీ కారు ఇప్పిస్తామని విశ్వంత్ తో పాటు అతని తండ్రి లక్ష్మీ కుమార్ నమ్మబలికారు. 2017లో రెడ్డి రామ కృష్ణకు ఇన్నోవా కారు తక్కువ ధరకు ఇప్పిస్తామని రూ. 10 లక్షలు తీసుకోవడం జరిగింది.

కేరింత ఫేమ్ విశ్వంత్ పై  బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఓ వ్యాపారి తనను విశ్వంత్ మరియు అతని తండ్రి మోసం చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రెడ్డి రామ కృష్ణ అనే వ్యాపారికి తక్కువ ధరకే లగ్జరీ కారు ఇప్పిస్తామని విశ్వంత్ తో పాటు అతని తండ్రి లక్ష్మీ కుమార్ నమ్మబలికారు. 2017లో రెడ్డి రామ కృష్ణకు ఇన్నోవా కారు తక్కువ ధరకు ఇప్పిస్తామని రూ. 10 లక్షలు తీసుకోవడం జరిగింది. మరలా ఓ నెల వ్యవధిలో మరో రూ. 2.50 లక్షలు లక్ష్మీ కుమార్ కి రెడ్డి రామకృష్ణ చెల్లించారు. 


డబ్బులు చెల్లించిన అనంతరం కారును రెడ్డి రామకృష్ణకు విశ్వంత్  తండ్రి ఇవ్వడం జరిగింది. అయితే ఆ కారును తన పేరున రిజిస్టర్ చేయించాలని రెడ్డి రామకృష్ణ కోరడంతో అసలు విషయం బయటికి వచ్చింది. రెడ్డి రామకృష్ణకు అమ్మిన ఇన్నోవా కారుపై రూ. 20 లక్షల ఫైనాన్స్ ఒక ప్రైవేటు సంస్థ నుండి తీసుకున్నారట. 

ఆ విషయం చెప్పకుండా దాచి తనను మోసం చేసి కారును విక్రయించారని రెడ్డి రామకృష్ణ వాపోయారు. తన డబ్బులు తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పక పోగా తప్పించుకు తిరుగుతున్నారని రెడ్డి రామకృష్ణ పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... విచారణ చేపట్టారని సమాచారం.  
   

click me!